నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా అతని తనయుడు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. కుదిరితే ప్రగతి భవన్, లేదంటే ఫామ్ హౌజ్ ల నుంచి పాలన సాగించే ప్రభుత్వం ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపిస్తోందని ఆయన విమర్శించారు. గత అరేళ్లుగా ఇలాగే పరిపాలన సాఘిస్తున్న ముఖ్యమంత్రికి ఇక నయా సెక్రటేరియట్ భవనం ఎందుకన్న విషయం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలరని ఆయన దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కన్నా అధికంగా జీతబెత్యాలు పోందుతున్న సొమరిపోతు ముఖ్యమంత్రి ఎవరన్నా వున్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని ఆయన ధ్వజమెత్తారు,
ఇలాంటి ముఖ్యమంత్రి హయంలో అధికారులు, రాష్ట్ర ఉద్యోగులు మాత్రం టంచనుగా టైముకి ఉద్యోగాలకు రావాలని ఎలా కోరుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న విషయం కూడా అర్థమవుతోందని ఇందుకు దుబ్బాక ఉపఎన్నికల పలితాలే అంకురార్పణగా నిలుస్తాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో రాష్ట్రంలో బీజేపి పతాకం రెపరెపలాడటం ఖాయమని చెప్పారు. కారు జోరుకు బ్రేకులు బీజేపి మాత్రమే వేయగలుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి కేటీఆర్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
కేటీఆర్ మాటలు వింటుంటే హైదరాబాద్ ఎన్నికల విషయంలో భయపడుతున్నట్టు అర్థమవుతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపి విజయదుఃధుభి మ్రోగిస్తోందన్న విషయం కేటీఆర్ కు అర్థమైందని అన్నారు, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తామని అరవింద్ వెల్లడించారు. ఇక మంత్రి కేటీఆర్ కు కేంద్రం ఇచ్చిన నిధుల కంటే బాలీవుడ్ సంగతులే బాగా తెలుసని వ్యంగ్యం ప్రదర్శించారు. బాలీవుడ్ తో కేటీఆర్ కు గొడవ జరిగినట్టు సోషల్ మీడియాలో చదివానని వెల్లడించారు. అయినా ముఖ్యమంత్రి కుమారుడు కాకపోతే కేటీఆర్ ను పట్టించుకునేదెవరని అరవింద్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more