(Image source from: Twitter.com/BJP4India)
రాజ్యసభలో బీజేపి బలం మరింతగా పెరిగింది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారిగా పెద్దల సభలోని తమ ఎంపీల సంఖ్యను సెంచరీ మార్కుకు చేర్చింది. తాజాగా, కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈ ఘనతను బీజేపీ సాధించగలిగింది. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశవ్యాప్తంగా తన బలాన్ని చాటుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయికి తన బలాన్ని కోల్పోయింది. ఓ వైపు బీజేపీ సెంచరీ మార్కు చేరిగా.. కాంగ్రెస్ మాత్రం తన బలం కుచించుకుపోతున్న విషయాన్ని గ్రహించలేకపోతోంది, ప్రస్తుతం 242 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్ బలం 38 మాత్రమే కావడం గమనార్హం.
అయితే బీహార్ ఎన్నికలలో తమకు కొంత ఎదురుగాలి వీస్తున్న తరుణంలోనూ అందివచ్చిన ప్రతీ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మాలుచుకునే పార్టీలు దీనిని కూడా అస్త్రంగానే మలుచుకున్నాయి, బీజేపికి చెందిన కేంద్రమంత్రో లేక ఎంపీలో ఈ విషయాన్ని ప్రచారాస్త్రంగా మలిస్లే సరిపోయే విషయమే అయినా.. ఏకంగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీయే కాంగ్రెస్ బలం ఎంతగా తగ్గిపోతోందో అంటూ వ్యంగోక్తులు విసిరారు. పార్లమెంటులోని రాజ్యసభ, లోక్ సభలను కలిపినా కాంగ్రెస్ కు 100 మంది ఎంపీలు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అంత ఘోరంగా ఉందని అన్నారు. ఏ విషయంపై చర్చించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని... అందుకే ఆ పార్టీ పార్లమెంటులో 100 కంటే దిగువకు పడిపోయిందని చెప్పారు.
ఇటీవల ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో 10 ఉత్తరప్రదేశ్, ఒకటి ఉత్తరాఖండ్ నుంచి ఉండగా, 9 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజ్యసభలో బీజేపీకి ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలైన ఆర్పీఐ, అసోం గణ పరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పట్టాలీ మక్కల్ కచ్చి, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పార్టీల మద్దతు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులున్నారు. రో నలుగురు నామినేటెడ్ సభ్యుల బలం కూడా కలుపుకుంటే, మొత్తం 104 మంది అధికారపక్షం వైపున్నట్టు. రాజ్యసభలో పూర్తి బలం చేకూరాలంటూ 121 మంది ఎంపీల సంఖ్య అవసరం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more