(Image source from: Oktelugu.com)
అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసులో తన పేరును బలవంతంగా ఇరికించారని, అసలు తనకు ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ఆయన దాఖలు చేసిన డిశ్చార్జీ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. తనకు సంబందం లేని ఓటుకు నోటు కేసు నుంచి తన పేరును తోలగించాలని ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం కోట్టివేసింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఓటకు నోటు కేసు నుంచి తొలగించేందుకు ఏసీబీ న్యాయస్థానం నిరాకరించింది. సండ్రతో పాటు మరో నిందితుడు ఉదయ్సింహ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
ఓటుకు నోటు కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని ఆయన తరపున ఆయన న్యాయవాది ఏసీబి న్యాయస్థానంలో వాదించారు. అయితే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహ, సెబెస్టియన్, లకు సంబంధించిన కాల్ డాటా, ఆదారాలన్నీ ఆయన కూడా ఓటుకు నోటు కేసులో నిందితుడని బలంగా చూపుతున్నాయని, ఈ క్రమంలో ఆయన పేరును ఈ కేసు నుంచి తొలగించవద్దని ఏసీబి తరపు న్యాయవాది బలంగా వాదించారు, ఈ కేసులో సండ్ర, ఉదయ్సింహ పాత్రలపై ఆధారాలున్నాయని ఏసీబీ పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్సింహ డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసింది. అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు ఓటుకు నోటు కేసు విచారణను 4కు వాయిదా వేసింది. కేసు విచారణకు ఇవాళ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్సింహ, సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more