దుబ్బాక ఉపఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్దమయ్యేలా వుందని ఆ పార్టీ వ్యవహార శైలి చూస్తుంటే అర్థమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి విజయశాంతి అన్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రావని ముందస్తుగానే మంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయని అమె అనుమానాలు వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలను సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ లో లెక్కించనున్నారా.? అని అమె ప్రశ్నించారు. రామలింగారెడ్డిని ఓడించిన చరిత్ర చెరుకు ముత్యంరెడ్డికి వున్నదన్న విషయాన్ని మర్చిపోరాదని అమె హితవు పలికారు.
హరిశ్ రావు వ్యాఖ్యలను బట్టి ఎన్నికలకు ముందే ఫలితాలెలా ఉండాలో టీఆర్ఎస్ నిర్ణయించిందనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. అయితే ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతల మాయమాటలకు లోంగి ఓట్లు వేసి ఓటర్లకు అధికార పార్టీ అరాచకాలపై ఉప ఎన్నికలలో కావాల్సినంత స్పష్టత వచ్చిందని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో జరిగే ఉపఎన్నికలో ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా హరీశ్ రావుకు హైరానా ఎందుకో ఎవరికీ అంతు చిక్కడంలేదని అన్నారు. సానుభూతి ఓట్లతో ఈజీగా గెలవాల్సిన చోట ఎందుకు అంతలా శ్రమిస్తున్నారని ప్రశ్నించారు.
దుబ్బాక గెలుపోటములతో.. ఓట్ల శాతంతో ఆయన మంత్రి పదవికి లింకు ఏర్పడిందని ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోందని అమె అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే... దాని ప్రభావం హరీశ్ మంత్రి పదవి మీద పడుతుందని కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అనే చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పారు. ఈ కారణం వల్లే ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ కరోనాను ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని ఓటర్లు అనుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more