Paidi thalli temple jatara celebrations పైడితల్లి అమ్మవారి జాతర.. పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

Vizianagaram paidi thalli temple jatara celebrations

Paidi Thalli, Sanchaitha Gajapathiraju, Paidithalli Temple, Mansas trust chairman, Paidithalli Temple celebrations, Pydithalli Temple, Sanchaitha, Vizianagaram, Andhra Pradesh

As a part of Paidi Thalli temple jatara celebrations, the mansas trust chairman Sanchaitha Gajapathiraju offered silk clothes to the diety

పైడితల్లి అమ్మవారి జాతర.. పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

Posted: 10/26/2020 09:16 PM IST
Vizianagaram paidi thalli temple jatara celebrations

(Image source from: Twitter.com/sanagajapati)

విజయనగరంలో పైడితల్లి జాతర ఇవాళ అంగరవైభవంగా సాగింది. పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులు కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చే పైడితల్లి జాతరను పురస్కరించుకుని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతో పాటు అమె అమ్మవారికి పసువు, కుంకుమ కూడా సమర్పించారు, మేళతాళాలు, పల్లకిలో పట్టువస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న సంచయితకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సంచయిత మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో తొలిసారి అమ్మవారిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. పైడితల్లి చల్లని కృఫాకటాక్షాలతో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. అమ్మవారి ఆశీర్వాదాలు భక్తజనులందరిపై వుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 1001 కోబ్బరికాయలను విజయనగరం కోట నుండి తీసుకువచ్చి భక్తులందరికీ పంచానని సంచయిత తెలిపారు.

(Video Source: NTV Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles