కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయం మలయప్పస్వామి కోదండరాముడి అవతారంలో దర్శనమిచ్చారు. కోదండరాముడిగా మలయప్ప స్వామి తన భక్తాగ్రేసుడు హనుమంతుడిని వాహనంగా చేసుకుని ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేశారు. ఈ హనుమంత వాహనంపై ఊరేగుతున్న కోదండరాముడ్ని దర్శించడం వ్ల అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరామ భక్తాగ్రగణ్యుడైన హనుమంతుడు స్మరించినంతనే ధైర్యం, ఆరోగ్యం, బుద్ది, బలం, యశస్సు సిద్ధిస్తాయి. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన కలిగిన మహనీయులు. కాబట్టి వారిని చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. అలాంటి హనుమంత వాహనంపై విహరించిన స్వామి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.
లంకాసురుడు దశకంఠుడైన రావణాసురుడ్ని యుద్దంలో అంతమొందించిన తరువాత శ్రీసీతారామలక్ష్మణులను లంక నుంచి తన భుజాలపై ఎక్కించుకుని తీసుకువచ్చారని.. దీనికి ప్రతీకగానే శ్రీవెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలోనూ హనుమంతుడి వాహనసేవను వినియోగిస్తూ వుండటం ఆనవాయితీగా వస్తోంది. ఇక హనుమంత వాహనంపై కోదండరాముడిగా అలంకృతుడైన శ్రీమలయప్ప స్వామి భక్తులకు అభయప్రధానం చేశారు. మంగళ వాయిద్యాలు, జీయంగార్లు, పండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు శ్రీవారి బ్రహోత్సవాలలో భాగంగా గజవాహన సేవను టీటీడీ నిర్వహించనుంది.
ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పకవిమాన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలన్నీ యథాతథంగా నిర్వహిస్తారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. ప్రతీఏడు కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజన సందోహానికి అభయప్రధానం చేసే శ్రీవారు ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి మాత్రమే ఉత్సవాలు పరిమితమయ్యాయి, తితిదే ఈవో జవహర్రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more