(Image source from: Deccanherald.com)
కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామికి దర్శనానికి క్రమంగా భక్తుజనకోటి క్యూకడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఇక ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా పునరుద్దరించే పనిలో పడిన తిరుమల తిరుపతి బోర్డు.. భక్తులకు అందుబాటులోకి పలు సేవలను తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే గత నెల సెప్టెంబర్ 7 నుంచి డిజిటల్ కళ్యాణోత్సవం సేవను అందుబాటులోకి తీసుకురాగా, ఇక ఆన్ లాక్ 5.0 కూడా అమల్లోకి రావడంతో మరిన్నీ సేవలను కూడా భక్తజనకోటి అందుబాటులోకి తీసుకుంచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో గత శని, ఆదివారాల్లో కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తరుపతి కొండపై దేవదేవుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ పునరాలోచనలో పడింది.
ఒక్కసారిగా ఏకంగా 16 వేల మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనానికి కొండపైకి రావడంతో టీటీడీ తమ నిర్ణయాలను పునఃసమీక్షించుకుంది. డిజిటల్ శ్రీవారి కల్యాణం చేసిన భక్తులకు స్థుపధం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని, అయితే కళ్యాణం చేసిన భక్తులకు మూడు నెలల లోపు ఈ ఉచిత దర్శనాన్ని పొందాలని టీటీడీ వారికి బంఫర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలను పాటించాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో ఇక శ్రీవారి డిజిటల్ కల్యాణోత్సవం టికెట్లను కూడా పరిమితి కలిగిన సంఖ్యలోనే విక్రయించాలని నిర్ణయించారు. దీంతో గత నెలలో బంపర్ ఆఫర్ ప్రకటించిన టీటీడీ ఈ సారి పరిమితిని విధించింది.
కల్యాణోత్సవం చేయించే భక్తులు, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా తిరుమల తిరుపతి దేవస్థానానినికి చేరుకుని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రావచ్చని, సుపథం ప్రవేశమార్గం ద్వారా వీరికి ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు అధికంగా వారాంతపు సెలవులు కలిగిన రోజులలోనే అధికంగా వస్తున్నారని గ్రహించిన టీటీడీ ఇకపై కల్యాణోత్సవం చేయించిన భక్తులు అధిక సంఖ్యలో రావడంపై పరిమితిని విధించింది. అందుకు వారి రాకను కాకుండా.. ప్రతీ రోజు కేవలం వెయ్యి శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. దీంతో కరోనా నిబంధనల మధ్యనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా టీటీడీ మార్గనిర్ధేశం చేయనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more