TTD issues limited tickets of Srivari kalyanotsavam శ్రీవారి ఆన్ లైన్ కళ్యాణానికి పరిమిత సంఖ్యలోనే టికెట్లు..

Ttd issues limited number of digital srivari kalyanotsavam tickets

Srivari Kalyanostavam, TTD, kalyanam devotees, supatham, free darshan, digital kalyan seva, Tirumala Tirupati Temple, YV Subba reddy, TTD Board Chairman, Tirupati, TTD News, Tirupati News, Tirupati latest news, Andhra Pradesh, devotional

After TTD announced bumper offer of Free darshan of Sri Venkateshwara swamy to the devotees through supatham entry, from last month 7th, Who perform Srivari digital Kalyanostavam, the rush had been increasing day to day, Which made the TTD to limit the sale of kalyanotsavam ticket to 1000 per day.

శ్రీవారి కళ్యాణానికి పెరుగుతున్న భక్తులు.. నియంత్రణకు టీటీడీ ఆంక్షలు..

Posted: 10/06/2020 04:30 PM IST
Ttd issues limited number of digital srivari kalyanotsavam tickets

(Image source from: Deccanherald.com)

కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామికి దర్శనానికి క్రమంగా భక్తుజనకోటి క్యూకడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఇక ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా పునరుద్దరించే పనిలో పడిన తిరుమల తిరుపతి బోర్డు.. భక్తులకు అందుబాటులోకి పలు సేవలను తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే గత నెల సెప్టెంబర్ 7 నుంచి డిజిటల్ కళ్యాణోత్సవం సేవను అందుబాటులోకి తీసుకురాగా, ఇక ఆన్ లాక్ 5.0 కూడా అమల్లోకి రావడంతో మరిన్నీ సేవలను కూడా భక్తజనకోటి అందుబాటులోకి తీసుకుంచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో గత శని, ఆదివారాల్లో కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తరుపతి కొండపై దేవదేవుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ పునరాలోచనలో పడింది.

ఒక్కసారిగా ఏకంగా 16 వేల మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనానికి కొండపైకి రావడంతో టీటీడీ తమ నిర్ణయాలను పునఃసమీక్షించుకుంది. డిజిటల్ శ్రీవారి కల్యాణం చేసిన భక్తులకు స్థుపధం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని, అయితే కళ్యాణం చేసిన భక్తులకు మూడు నెలల లోపు ఈ ఉచిత దర్శనాన్ని పొందాలని టీటీడీ వారికి బంఫర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలను పాటించాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో ఇక శ్రీవారి డిజిటల్ కల్యాణోత్సవం టికెట్లను కూడా పరిమితి కలిగిన సంఖ్యలోనే విక్రయించాలని నిర్ణయించారు. దీంతో గత నెలలో బంపర్ ఆఫర్ ప్రకటించిన టీటీడీ ఈ సారి పరిమితిని విధించింది.

కల్యాణోత్సవం చేయించే భక్తులు, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా తిరుమల తిరుపతి దేవస్థానానినికి చేరుకుని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రావచ్చని, సుపథం ప్రవేశమార్గం ద్వారా వీరికి ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు అధికంగా వారాంతపు సెలవులు కలిగిన రోజులలోనే అధికంగా వస్తున్నారని గ్రహించిన టీటీడీ ఇకపై కల్యాణోత్సవం చేయించిన భక్తులు అధిక సంఖ్యలో రావడంపై పరిమితిని విధించింది. అందుకు వారి రాకను కాకుండా.. ప్రతీ రోజు కేవలం వెయ్యి శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. దీంతో కరోనా నిబంధనల మధ్యనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా టీటీడీ మార్గనిర్ధేశం చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles