(Image source from: Dailymotion.com)
దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ అగ్రనేత, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అక్కడి బీజేపి ప్రభుత్వం అడ్డుకుని పోలీసులతో తోసివేయించడంతో ఆయన కిందపడిన ఘటనపై మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపి కార్యాలయం ఎదుల ధర్నా నిర్వహించేందుకు సన్నధమయ్యాడు. దీంతో ఉద్రిక్తతలు నెలకొంటాయని భావించిన పోలీసులు ముందుస్తుగా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. గాంధీ భవన్ లోనే ఆయనను కట్టడి చేయాలని ప్రయత్నించారు.
పోలీసులను దాటుకుని రేవంత్ బీజేపి కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించినా గాంధీ భవన్ బయట మోహరించిన పోలీసులు ఆయనను అడ్డకుని జీపులో ఎక్కించి గోషామహల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు కాంగ్రెస్ యువనేత అనీల్ కుమార్ యాదవ్ ను బీజేపి నేతలు అడ్డకుని దాడి చేశారని వార్త రేవంత్ కు తెలియడంతో ఆయన పోలీసులను దాటుకుని వెళ్లి నాంపల్లి రోడ్డుపై భైఠాయించి ధర్నాకు దిగారు, ఆయనకు పోటీగా బీజేపి శ్రేణులు కూడా ధర్నాకు దిగడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి గోషామహల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ ఆవరణలోకి చోచ్చుకోచ్చి.. అందోళనకు దిగిన బీజేపి కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపి కార్యకర్తలు.. పోలీసు వాహనాం వెంట కూడా పరుగులు తీసి టెన్షన్ పెట్టించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ దిష్టి బొమ్మ దహనానికి యత్నించగా, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాంపల్లిలోని రెండు జాతీయ పార్టీల కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అలుముకుంది. రేవంత్ రెడ్డి పిలుపుతో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున గాంధీ భవన్ కు తరలిరాగా, అటు బీజేపి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రాష్ట్ర కార్యలాయాలకు చేరుకున్నారు. ఇక ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఈ క్రమంలో అందోళనలకు దిగిన ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more