(Image source from: Thehansindia.com)
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 11 రాష్ట్రాలలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన అభ్యర్థులు ఈ సారి తమకు పోటీదారుడైన రామలింగారెడ్డి లేకపోవడంతో తమ విజయం ఖాయమని ఇప్పటికే జోరుగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సారైనా ఓటరన్న అశీర్వదించకపోతాడా అన్న కోటిఆశలతో బరిలో నిలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తాజాగా, ఈ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. బిహార్ లోని వాల్మీకీ నగర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు దేశంలోని 11 రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 9న దేశంలోని దుబ్బాక సహా 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 17న అభ్యర్థుల నామినేషన్ల స్ర్కృట్నీ జరుగుతుంది. ఇక 18న ఆదివారం కావడంతో ఆ మరుసటి రోజు అంటే అక్టోబరు 19న నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీగా ప్రకటించారు. ఇక ఆ వెంటనే నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 10 తేదీన కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.
దుబ్బాకలో ఈసారైనా పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తుండగా, రామలింగారెడ్డిపై సానుభూతి పవనాలు తమ పార్టీని గట్టెకిస్తాయని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే జోరందుకున్న ప్రచారంతో రాజకీయ పార్టీలు ముందుకు సాగుతుండగా, ఇక షెడ్యూల్ విడుదల కావడంతో వారికి మరింత జోష్ తీసుకువచ్చినట్లు వుంది. ఇక మణిపూర్ లోని రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు బిహార్ లోని పార్లమెంటు స్థానానికి ఈ నెల 13న నోటిపికేషన్ విడుదల కానుండగా, 20న నామినేషన్లకు చివరి తేది, 21న నామినేషన్ల పరిశీలిన, 23న ఉపసంహరణలకు చివరి తేదీ, నవంబర్ 7న పోలింగ్, పదిన కౌంటింగ్ చేపట్టనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more