(Image source from: Dialoguepakistan.com)
ప్రేమ బంధం మరింత ధృడంగా ఉండాలని తమ ప్రేయసికి విలువైన కానుకలు ఇచ్చేవారున్నారు. కానీ తమ బాస్ లకు ఇలాంటి వస్తువులను ఇచ్చి వారి మెప్పుపోందాలని చూస్తుంటారు. ఇక కొందరు తనకు కాబోయే జీవిత భాగస్వామికి విలువైన కానుకులు ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటుంటారు. అయితే ఖరీదైన కానుకలు ఇవ్వడం గొప్పా.. లేక విలువైన కానుకలు ఇవ్వడం మేలా.? అన్న చర్చకు కూడా ఇది దారితీస్తోంది. అయితే ఖరీదైన కానుక కన్నా విలువైన కానుకకే అధిక ప్రాధన్యాత లభిస్తుంది. ఇక దీనికి తోడు ఎంత ప్రేమానురాగంతో ఆ కానుక అందించామన్న దానిపై కూడా విలువ అధారపడి వుంటుందన్నది కాదనలేని వాస్తవం.
ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమతో పాటు యావత్ దేశంలో సంచలనంగా మారిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఆ మధ్య ఓ అరుదైన అసక్తి రేపే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఆయన ప్రేయసి రియా చక్రవర్తి పేరు వినిపించడం.. అమె వాంగ్మూలంలో చెప్పిన పేర్లను అధారంగా చేసుకుని బాలీవుడ్ లోని పలువురు ప్రముఖ నటీమణులు పేర్లు కూడా వెలుగులోకి రావడం వారందరికీ ఎన్సీబి అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని అదేశించడం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే సుశాంత్ గురించి వెలుగుచూసిన ఆసక్తికర విషయం ఏమిటంటే..
సుశాంత్ కు గ్రహాలపై స్థలాలు కొనుగోలు చేయడం అంటే చాలా ఆసక్తి. 2018లో సుశాంత్ సింగ్ చంద్రుడిపైనా కూడా స్థలాన్ని కొనుగోలు చేశాడు, మారే ముస్కోవిన్స్ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశాడు. ఈ ఇన్స్పిరేషన్ తో చాలామంది స్థలాలు కొనుగోలు చేశారు తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఏకంగా ఎకరం స్థలం కోని కానుకగా ఇచ్చాడు. అదీ భూమిపై కొన్న స్థలం కాదు, చంద్రునిపై కొన్న స్థలం. తన చాందినీ కోసం చంద్రుడి మీద ఒక ఎకరం స్థలాన్ని కోని దానిని అమె పేరున రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇచ్చాడు. ఈ స్థలం కొనుగోలు చేయడం వలన ప్రస్తుతం ఉపయోగం లేకపోయినా.. భవిష్యత్తులో చంద్రునిపై మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నానని అన్నాడు.
చంద్రుడిపై అవాసం ఏర్పాటు చేసే సమయానికి తన భార్య పేరున ఒక ఎకరం స్థలం వుంటుందని ఇలా చేశానన్నాడు, ఇంతకీ అతను ఎవరంటే. పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన సొహైబ్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్యకు సి ఆఫ్ వేపర్ అనే ప్రదేశంలో ఓ ఎకరం స్థలం కొనుగోలు చేశాడు. దీని ధర రూ.3300 ఉన్నట్టు అహ్మద్ తెలిపారు. ఇంటర్నేషనల్ ల్యూనార్ ల్యాండ్ రిజిస్ట్రీలో ఈ స్థలం కొనుగోలు చేశాడు. ఈ సంస్థ నుంచి ల్యాండ్ కు సంబంధించిన ఒరిజినల్ డాకుమెంట్స్ ఇటీవలే అహ్మద్ కు అందడంతో వాటిని తన భార్యకు గిఫ్ట్ గా అందించాడు. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చంద్రునిపై కొన్న స్థలాన్ని భార్యకు వెడ్డింగ్ డే గిఫ్టుగా సోహైబ్ ఇచ్చాడట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more