Man gifts land on Earth's Moon for his wife as wedding gift భర్త అరుదైన పెళ్లి కానుకగా.. చాందనీ కోసం చంద్రుడిపై..

Pakistani man buys land on earths moon for his wife as wedding gift

Sohaib Ahmed, Lunar property, Rawalpindi, Acre Land on Moon, Earth's Moon, Sea of Vapour, Wedding gift, Pakistani Man, Moon, Sushant singh Rajput

A Man from Pakistan Purchases an acre land on Earth's Moon at Sea of Vapour and gitfs it to his wife as wedding gift.

భర్త అరుదైన పెళ్లి కానుకగా.. చాందనీ కోసం చంద్రుడిపై..

Posted: 09/24/2020 04:12 AM IST
Pakistani man buys land on earths moon for his wife as wedding gift

(Image source from: Dialoguepakistan.com)

ప్రేమ బంధం మరింత ధృడంగా ఉండాలని తమ ప్రేయసికి విలువైన కానుకలు ఇచ్చేవారున్నారు. కానీ తమ బాస్ లకు ఇలాంటి వస్తువులను ఇచ్చి వారి మెప్పుపోందాలని చూస్తుంటారు. ఇక కొందరు తనకు కాబోయే జీవిత భాగస్వామికి విలువైన కానుకులు ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటుంటారు. అయితే ఖరీదైన కానుకలు ఇవ్వడం గొప్పా.. లేక విలువైన కానుకలు ఇవ్వడం మేలా.? అన్న చర్చకు కూడా ఇది దారితీస్తోంది. అయితే ఖరీదైన కానుక కన్నా విలువైన కానుకకే అధిక ప్రాధన్యాత లభిస్తుంది. ఇక దీనికి తోడు ఎంత ప్రేమానురాగంతో ఆ కానుక అందించామన్న దానిపై కూడా విలువ అధారపడి వుంటుందన్నది కాదనలేని వాస్తవం.

ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమతో పాటు యావత్ దేశంలో సంచలనంగా మారిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఆ మధ్య ఓ అరుదైన అసక్తి రేపే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఆయన ప్రేయసి రియా చక్రవర్తి పేరు వినిపించడం.. అమె వాంగ్మూలంలో చెప్పిన పేర్లను అధారంగా చేసుకుని బాలీవుడ్ లోని పలువురు ప్రముఖ నటీమణులు పేర్లు కూడా వెలుగులోకి రావడం వారందరికీ ఎన్సీబి అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని అదేశించడం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే సుశాంత్ గురించి వెలుగుచూసిన ఆసక్తికర విషయం ఏమిటంటే..

సుశాంత్ కు గ్రహాలపై స్థలాలు కొనుగోలు చేయడం అంటే చాలా ఆసక్తి. 2018లో సుశాంత్ సింగ్ చంద్రుడిపైనా కూడా స్థలాన్ని కొనుగోలు చేశాడు, మారే ముస్కోవిన్స్ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశాడు. ఈ ఇన్స్పిరేషన్ తో చాలామంది స్థలాలు కొనుగోలు చేశారు తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఏకంగా ఎకరం స్థలం కోని కానుకగా ఇచ్చాడు. అదీ భూమిపై కొన్న స్థలం కాదు, చంద్రునిపై కొన్న స్థలం. తన చాందినీ కోసం చంద్రుడి మీద ఒక ఎకరం స్థలాన్ని కోని దానిని అమె పేరున రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇచ్చాడు. ఈ స్థలం కొనుగోలు చేయడం వలన ప్రస్తుతం ఉపయోగం లేకపోయినా.. భవిష్యత్తులో చంద్రునిపై మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నానని అన్నాడు.

చంద్రుడిపై అవాసం ఏర్పాటు చేసే సమయానికి తన భార్య పేరున ఒక ఎకరం స్థలం వుంటుందని ఇలా చేశానన్నాడు, ఇంతకీ అతను ఎవరంటే. పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన సొహైబ్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్యకు సి ఆఫ్ వేపర్ అనే ప్రదేశంలో ఓ ఎకరం స్థలం కొనుగోలు చేశాడు. దీని ధర రూ.3300 ఉన్నట్టు అహ్మద్ తెలిపారు. ఇంటర్నేషనల్ ల్యూనార్ ల్యాండ్ రిజిస్ట్రీలో ఈ స్థలం కొనుగోలు చేశాడు. ఈ సంస్థ నుంచి ల్యాండ్ కు సంబంధించిన ఒరిజినల్ డాకుమెంట్స్ ఇటీవలే అహ్మద్ కు అందడంతో వాటిని తన భార్యకు గిఫ్ట్ గా అందించాడు. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చంద్రునిపై కొన్న స్థలాన్ని భార్యకు వెడ్డింగ్ డే గిఫ్టుగా సోహైబ్ ఇచ్చాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles