కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కొందరిపై ప్రేమను కనబరుస్తూ మరికోందరిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎన్సీపీ అధినేత, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ అన్నారు. తమపై మాత్రం రంధ్రాన్వేషణ చేస్తూ కక్షపూరిత రాజకీయాలకు దిగుతోందని ఆయన పేర్కోన్నారు. ఇందులో భాగంగా తనకు కూడా కేంద్ర ఆదాయ పన్ను శాఖ తనకు కూడా నోటీసులు పంపిందని తెలిపారు. గతంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లపై కొన్ని వివరణలు కోరుతూ నిన్న ఈ నోటీసులు తనకు అందాయని విలేకర్లతో అన్నారు. మహారాష్ట్రలోని పలువురు బీజేపియేతర నేతలకు ఈ నోటీసులు అందాయన్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే, తన కుమార్తె ఎంపీ సుప్రియా సూలేకు సైతం ఆదాయపన్ను శాఖ ఇలాంటి నోటీసులను పంపిందని చెప్పారు. ఇక తాజాగా తనకు ఈ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందాయని తెలిపారు. ఎన్నికల సంఘానికి సంబంధించి ఇచ్చిన అఫిడవిట్ లకు సంబంధించి వివరణలు, ధ్రువీకరణలను కోరిందని.. వాటికి తాము సమాధానం చెబుతామన్నారు. వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకించే క్రమంలో సస్పెన్షన్కు గురైన ఎంపీలకు సంఘీభావంగా మాజీ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒక్కరోజు పాటు దీక్షకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ బేబీ పౌడర్ జాన్సన్ & జాన్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు... Read more
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more