భారతీయ స్టేటు బ్యాంకు తమ ఖాతాదారుల డబ్బును పటిష్ట భద్రతను కల్పించే విషయంలో మరో అడుగుముందుకేసింది. ఇన్నాళ్లు కేవలం రాత్రి సమయంలోనే వర్తించే ఓటీపిని ఇక పగలు కూడా అమల్లోకి తీసుకురానుంది. అదేంటీ అంటే.. భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులు ఇకపై ఎప్పుడు కాసింత పెద్ద మొత్తంలో డబ్బును విత్ డ్రా చేయాలని భావించినా ఇకపై ఫోన్ ను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. లేని పక్షంలో డబ్బులు విత్ డ్రా కావు. ఫోన్ కు డబ్బుకు అనుసంధామేంటీ అంటే ఇకపై పది వేల రూపాయల కన్నా అధికంగా డబ్బును విత్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా ఓటిపీని ఎంటర్ చేయాల్సిందే.
అయితే గత జనవరి మాసం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ఎస్బీఐ ఏటీఎంలలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ.10 వేలు లేక అంతకంటే కంటే ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే కస్టమర్ల మొబైల్కు వచ్చే ఓటీపీ నంబర్ ఎంటర్ చేయడం ఇప్పటివరకు అమల్లో ఉంది. అయితే, ఈ నెల 18 నుంచి 24 గంటల పాటు ఈ నిబంధన అమల్లోకి రానుంది. రూ.10 వేలు లేక అంతకంటే ఎక్కువ నగదు తీసుకుంటే డెబిట్ కార్డు పిన్ నంబరునే కాకుండా, ఓటీపీని కూడా నమోదు చేయాల్సిందేనని ఎస్బీఐ తెలిపింది. అయితే విత్ డ్రా సమయంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికే ఎస్బీఐ ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది.
కాగా గ్రామీణ భారతంలో నాలుగు నెంబర్లు వున్న పిన్ ఎంటర్ చేయడానికే వేరొకరి సాయం కోరుతున్న నిరక్షరాస్యులకు ఈ కొత్త నిబంధన మరిన్ని కష్టాలను తీసుకువస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆ బ్యాంకు తెలిపింది. అమెరికాలో మాదిరిగా మరికొన్ని సదుపాయాలు కూడా కల్పించాలనుకుంటున్నట్లు పేర్కొంది. క్రెడిట్కార్డు ఉన్న వారు వారి ఖాతా నుంచి క్రెడిట్ స్కోరు తెలుసుకునేందుకు ఖాతాలోకి లాగిన్ అయి తెలుసుకోవచ్చని, ఇందుకోసం ఎటువంటి చెల్లింపులూ చేసే అవసరం లేదని తెలిపింది. కస్టమర్లకు ఉపయోగపడే ఈ ఫీచర్ను వెంటనే అమలు చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more