(Image source from: Twitter.com/ANI)
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి సదరు ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన తరువాత కూడా అక్కడ ఉగ్రవాద ఆగడాలు సద్దుమణగడం లేదు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని షోపియాన్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను హతమార్చి 12 గంటలు కూడా తిరక్కముందే మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయే ప్రయత్నం చేశారు. అయితే భారత బధ్రతా బలగాలు ధీటైన సమాధానం ఇవ్వడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరితో పాటుగా ఎదురుకాల్పుల్లో ఒక భారత జవాను కూడా అమరుడయ్యాడు. దీంతో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఇరువర్గాలకు మధ్య జరిగిన ఎదరుకాల్పుల్లో జదూర ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది.
పూల్వామా జిల్లాలో అక్రమంగా చోచ్చుకువచ్చిన ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు.. జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్భంధ తనిఖీలు చేపట్టారు, అనంతరం జిల్లాలోని జదూర ప్రాంతంలోనే వారు తలదాచుకన్నారన్న సమాచారంతో ఎక్కడికక్కడ నిర్బంధ తనిఖీలు చేస్తుండగా, వీరి కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు వారి నుంచి తప్పించుకునేందుకు భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు, వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు హుటాహుటిన ఎదురుకాల్పులకు పాల్పడి ధీటైన సమాధానం చెప్పాయి. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఎదరుకాల్పులు చోటుచేసుకున్నాయి.
అర్థరాత్రి వేళ ఒక్కసారిగా కాల్పులు మోత వినిపించడంతో జదూర ప్రాంతంలో స్థానికులు భయకంపితులయ్యారు. కాగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు ఆక్కడికక్కడే మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులతో పోరులో ఒక జవాను కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. అయితే ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందిన వారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని అర్మీ వర్గాలు తెలిపాయి. కాగా ఇవాళ ఉదయం కూడా భారత బలగాలు సర్చ్ అపరేషన్ కోనసాగిస్తున్నాయని అధికారక వర్గాలు తెలిపాయి. దీనికి తోడు నిర్భంధ తనిఖీలను కూడా చేస్తున్నాయని పేర్కోన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more