కరోనా మహమ్మారి విజృంభణతో ఆగిపోయిన పలు ప్రవేశ పరీక్షల నిర్వహణలను త్వరలోనే నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన పరీక్షల తేదీలను విడుదల చేశారు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల తేదీలనూ ఆయన ఈ సందర్భంగా విడుదల చేస్తూ,, పరీక్షలకు విద్యార్ధులు అందరూ సన్నధం కావాలని తెలిపారు, కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఏప్రిల్, మే మాసాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కాగా, వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సెట్ ల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసిందని.. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, సెప్టెంబర్ 10, 11న ఐసెట్; సెప్టెంబర్ 14న ఈసెట్; సెప్టెంబర్ 28, 29, 30న ఏపీపీజీఈసెట్; అక్టోబర్ 1న ఎడ్సెట్, లాసెట్; అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈసీఈటీ పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు.
అలాగే తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్సెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్ను బట్టి ఖరారు చేయనున్నట్లు సమాచారం.
EAMCET - సెప్టెంబర్ 17-25
ECET - సెప్టెంబర్ 14
ICET - సెప్టెంబర్ 10 & 11
EDCET & LAWCET - అక్టోబర్ 01
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more