రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై తెలంగాణ ప్రభుత్వంపై మరోమారు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని చెప్పినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పుకనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయస్థానం అదేశాల మేరకు కోర్టుకు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ప్రశ్నలను సంధించింది.
తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. కరోనావైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని సీఎస్ ను ప్రశ్నించింది. కరోనాపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, ఆక్సిజన్ బెడ్ల కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల అంశంపై సోమేష్ కుమార్ ను న్యాయస్థానం నిలదీసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల సక్సెస్ రేట్ ఎంతన్న విషయాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం వెల్లడించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ టెస్టులతో 40శాతం మాత్రమే కరెక్టు పలితాలు వస్తాయని న్యాయస్థానం పేర్కోంది. ఇలాంటి తరుణంలో ఈ టెస్టులపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో కూడా వెల్లడించాలని అదేశించింది.
రాష్ట్రంలో అనేక జిల్లాలో అక్సిజన్ బెడ్లు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని న్యాయస్థానం తెలిపింది. ఆసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట సహా పలు కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్ల కొరత వుందని న్యాయస్థానం తెలిపింది. స్వియనిర్భంధంలో వున్న రోగుల సౌకర్యార్థం తీసుకువచ్చిన హితం యాప్ పై ప్రజలల్లో ఎంతమేరకు అవగాహన తీసుకువచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. సవిరంగా కరోనా బులిటెన్లను ప్రసారం చేయాలని అదేశాలను జారీచేసినా.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలను అందులో పోందుపర్చకపోవడంపై సీఎస్ సోమేష్ కుమార్ ను న్యాయస్థానం నిలదీసింది.
ప్రైవేటు ఆసుపత్రులు రోగుల కుటుంబసభ్యులను డబ్బుకోసం పీడిస్తున్నాయని... దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50 ఆసుపత్రులపై పిర్యాదులు రాగా, వాటిలో 46 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని సోమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు. వాటిలో కేవలం 16 మాత్రమే నోటీసులకు బదులిచ్చాయని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం కన్నా శక్తివంతంగా కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. యాభై అసుపత్రులపై పిర్యాదులు వస్తే కేవలం రెండు ఆసుపత్రులపైనే చర్యలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుత్రుల లీజులు ఎందుకు రద్దు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
(Video Source: V6 News Telugu)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more