(Image source from: Timesofindia.indiatimes.com)
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పరిశోధనలు సాగుతూనే వున్నాయి. ఈ మహమ్మారి నుంచి మానవాళిని రక్షించుకునే క్రమంలో కరోనా వాక్సీన్ ను కూడా రపోందిస్తున్నాయి. ప్రస్తుతం వాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్న తరుణంలో విజయవంతమైన ఫలితాలు వస్తుండగా, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఈ వాక్సీన్ ను తక్కువ ధరకే విక్రయించేందుకు ఏకంగా 150 మిలియన్ డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ ను ముందస్తు ఆర్డర్ ను ఇచ్చి ఒప్పందం చేసుకుంది గవి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంస్థ. ఈ మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ఇక కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఫెవిపిరావిర్, రెమిడిసివీర్ మందులను ఇప్పటికే నల్లజబారులో కొనుగోలు చేస్తున్న ధరలను పక్కనబెడిటే.. అసలు ధర కూడా వేలలో వుండటంతో ఇక వాక్సీన్ ధర ఎంత ఉంటుందో.. ఎంతగా నిర్ణయిస్తారో అన్న అనుమానాలు కూడా మరోవైపు సామాన్యుల మెదళ్లను తొలుస్తున్నాయి. అయితే కోవిడ్ వాక్సీన్ ధరను మూడు డాలర్లుగా నిర్ణయించినట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వెల్లడించింది. భారత్ సహా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ధరతో వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయోద ధశ పూర్తైన తరువాత ఆక్స్ఫర్డ్, నోవావాక్స్కు చెందిన వ్యాక్సిన్ లకు 100 మిలియన్ల డోసులను తయారికీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ వాక్సీన్లను భారత్ సహా 92 అభివృద్ది చెందుతున్న, చెందని దేశాలకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యాక్సిన్లు 2021 మధ్యకల్లా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తరవాత వాటి ఉత్పత్తి పెంచేందుకు సీరమ్ సంస్థ గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల మూలధనాన్ని పొందనుంది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైరస్ను కట్టడి చేయడానికి పేద దేశాలకు తగిన సహకారం అవసరమని సీరమ్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రజల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more