కరోనా మహమ్మారి మహా భయంకరమైన వైరస్. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే పలు దేశాలలోని ప్రముఖులు అస్వస్థతకు గురికాగా, వారిలో కొందరు అనంతవాయువుల్లో కలసిపోయారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడి బీజేపి నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఆయన తనకు కరోనా సోకిందని, దాని నుంచి నయమయ్యేందుకు చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. కరోనా డేంజరస్ వైరస్ అని దీని బారిన ఎవ్వరూ పడవద్దని, అత్యవసరం అయితే తప్ప ఎవ్్వరూ ఇళ్ల నుంచి కూడా బయటకు రావద్దని ఆయన సూచిస్తూ ఓ వీడియో సందేశాన్ని కూడా పంపారు. అయితే ఆయన కోలుకుని ఇంటికి తిరిగివస్తారని ఆయన అనుయాయువులు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్న తరుణంలో ఆయన విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మరణించడంతో ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర బీజేపిలో విషాదం అలుముకుంది.
అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. 1961 నవంబర్ 1న తాడేపల్లిగూడెంలో జన్మించిన మాణిక్యాలరావు.. 9 ఏళ్ల వయస్సులోనే ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడై అందులో చేరారు. బీజేపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఫొటోగ్రాఫర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ -బీజేపి కూటిమి అభ్యర్థిగా 2014లో తాడేపల్లిగూడెం నుంచి పోటీచేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more