దేశంలో నూతన విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చిన కేంద్రం ఈ ఏడాది నుంచి ఉపాధ్యాయుల నియామకాల్లోనూ సమూల మార్పులను తీసుకువచ్చేందుకు సంకల్పించింది. డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులలో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇప్పటి వరకు గ్రామీణ, మారుమూల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో తాత్సారం జరిగిందన్న వాదనల్లో కేంద్రం ఇకపై ఎలాంటి అలసత్వాలు లేకుండా వారికి కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఉపాధ్యాయుల నియామకాల్లోనూ మార్పులు చేసింది. ఉపాద్యాయుల నియామకాలను మరింత కఠినతరం చేసింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తో పాటు తరగతి గది బోధన లేదా ముఖాముఖి(ఇంటర్వూ)నీ ఇందులో భాగం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికీ ఆ నిబంధనలను తప్పనిసరి చేసింది. ముఖాముఖిలో భాగంగా స్థానిక భాషలో వారికున్న ప్రావీణ్యాన్నీ పరిశీలిస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని చాలా పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు స్థానిక బాషల్లో ప్రావిణ్యం వున్నా.. టెట్ రాయలేదు. ఇక రాష్ట్రాల్లో టెట్ పరీక్షలు కూడా ప్రభుత్వ నిర్వహించడం లేదు. పలు రాష్ట్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించి మూడేళ్లు కూడా కావస్తోంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కార్పొరేట్ పాఠశాలల్లో బీటెక్ అభ్యర్థులూ బోధిస్తున్నారు.
ఈ విధానం అమల్లోకి వస్తే వారందరూ టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. పాఠశాల విద్యలో నాలుగు దశలు ఉన్నందున అన్ని దశల్లో పనిచేసే గురువులకు టెట్ ను విస్తరిస్తారు. అంటే శిశు తరగతులకు బోధించే వారికీ ఇది తప్పనిసరి కానుంది. భారతీయ సంస్కృతి, కళలు, వృత్తి విద్యను చదువులో భాగం చేస్తామని పేర్కొన్న కేంద్రం ఆయా నిపుణులను ఆయా పాఠశాలలు లేదా స్కూల్ కాంప్లెక్స్లు నియమించుకునే వెసులుబాటు కల్పించింది. స్థానికంగా ప్రముఖ వ్యక్తులనూ ఇన్స్ట్రక్చర్లుగా నియమించుకోవచ్చని తెలిపింది. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా నాణ్యమైన ఉపాధ్యాయుల కొరత త్రీవంగా ఉన్నచోట పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహకాలు(స్థానికంగా లేదా పాఠశాల ఆవరణలో ఇల్లు సమకూర్చడం లేదా ఇంటి భత్యం పెంచడం వంటివి) ఇస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more