ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను ఇప్పటికే చిదిమేస్తోంది. దీనిని నియంత్రించేందుకు వాక్సీన్ తయారీలో ప్రపంచ దేశాలు తలమునకలు అయ్యాయి. ఇక ఈ సమంలోనూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఈ నిర్ణయాలతో మహమ్మారి ప్రబలకుండా చర్యలు తీసుకునే నేపథ్యంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం వయోవృద్దులు, బీపి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పోస్టల్ బ్యాలెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. ఈ మేరకు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా సేకరించిన అనంతరం నిర్ణయం కూడా తీసుకుని ముందుకు అడుగులు వేసింది.
అయితే తాజాగా పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. వయోవృద్దులకు, బిపి, మధుమేహం, ఇతరాత్ర సుదీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారిని ఓటు హక్కుకు కూడా విలువను ఇచ్చి వారిని కూడా ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పింది. కానీ తాజాగా మాత్రం అందుకు పలు అంశాలు మోకాలడ్డుగా నిలుస్తున్నాయని పేర్కోంది, రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, ఇతర ఏ ఎన్నికల్లో గానీ ప్రస్తుతానికి 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడం లేదని స్పష్టంచేసింది.
దీని అమలు విషయంలో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు, సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. రానున్న బిహార్ ఎన్నికలు, మధ్యప్రదేశ్లో 24 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని ఈ నెల మొదట్లో ఈసీ భావించింది. 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉన్న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన అందరికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. బిహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 26తో ముగియనున్న నేపథ్యంలో ఆలోపే అక్కడ ఎన్నికలు జరపాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more