దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. అక్కడి, ఇక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడకు చోచ్చుకెళ్తోంది. లాక్ డౌన్ విధింపుతో సుమారు 80 రోజుల పాటు భక్తుల తాకిడి లేకుండా వెలవెలబోయిన కలియుగ వైకుంఠంలో అన్ లాక్ 1.0 మార్గదర్శకాలతో ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ తరుణంలో పవిత్ర కోండపై కరోనా కలకలం రేగింది. గత నెల నుంచి ప్రారంభమైన శ్రీవెంకటేశ్వరుడి దివ్యదర్శనం నేపథ్యంలో ఏడుకోండలపై కరోనా కలవరం తీవ్ర అందోళనకు గురిచేసింది. గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. ఏకంగా 140 మంది టీటీడీ సిబ్బంది, అర్చకులకు కరోనా సోకింది, అయితే ఇందుకు టీటీడీ అధికారులను బాధ్యులుగా చేస్తున్నారు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.
ఓ వైపు కరోనా వైరస్ విజృంభన కోనసాగుతున్నా పవిత్రమైన శ్రీవారి కోండపైకి భక్తులను ఎందుకు అనుమతిస్తు్నారని, శ్రీవారి దర్శనం ఎందుకు కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని, దీనికి తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీనివాస రాజు అందుకు అడ్డుపడుతున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. టీటీడీలో పని చేస్తున్న 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా సోకిందని, మరో 25 మంది ఫలితాలు రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. వైరస్ ఇంకా వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ దర్శనాలు నిలిపివేయడం లేదన్న ఆయన ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని రమణదీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు.
రమణ దీక్షితులు వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ సుబ్బారెడ్డి విబేధించారు. ఇప్పట్లో దర్శనాలు నిలిపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రమణ దీక్షితులు చెప్పాల్సింది ఏమైనా ఉంటే బోర్డుకు చెప్పాలే తప్ప.. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అన్నమయ్య భవన్ లో ఆర్చకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులకు 40 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. కరోనా బారిన పడిన వారిలో 14 మంది అర్చకులు ఉన్నారని అయన అన్నారు. కాగా ఇప్పటికే కరోనా నేపథ్యంలో టీటీడీ అన్ని చర్యలు చేపడుతోందని అన్నారు. ఇక భక్తుల నుంచి కరోనా వస్తుందన్నట్లుగా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల్లోనూ నిజం లేదని అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
అయితే తిరుపతిలో కోరానా సోకిన వ్యక్తులు కోండపైకి వచ్చిన నేపథ్యంలో ఈ వైరస్ సోకి వుంటుందని అనుమానాలకు కలెక్టర్ ప్రకటనతో చెక్ పడింది. అయితే భక్తులకు ఏ విధమైన కరోనా లక్షణాలున్నా, కొండపైకి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసిన వైవీ సుబ్బారెడ్డి, తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు వారం రోజుల పాటు కొండపైనే ఉండే విధంగా షిఫ్ట్ లలో విధులను వేస్తున్నామని గుర్తు చేశారు, గత నెల చివరి వారంలో విధులు నిర్వహించిన వారిలో కొందరికి వైరస్ సోకిందని అన్నారు. ఇక తాజా పరిణామాలపై చర్చించేందుకు టీటీడీ బోర్డు ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసి చర్చిస్తూనే వుందని, అన్నారు. తిరుమల కోండపై పవిత్రను కాపాడుతూనే భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more