కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తమ దేశ ప్రజల ప్రాణాలను హరించేస్తుందేమోనన్న భయాందోళనకు గురైన ప్రభుత్వాలు.. టెస్టులను చేపట్టాయి. వందలు దాటి వేలు దాటి లక్షల సంఖ్య దాటి ఏకంగా కోటి మార్కును దాటిన టెస్టుల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఖర్చుకు వెనకాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ క్రమంలో దాదాపు ఐదు వేల నుంచి సగం ధరకు మాత్రమే కోవిడ్-19 టెస్టుల కిట్ ధర చేరుకున్నాక ప్రభుత్వం మార్గదర్శకాలతో ప్రైవేటు ల్యాబ్ లలో టెస్టులకు అనుమతులను జారీ చేసింది. ఇక దేశంలో ఏకంగా పది లక్షల చేరువలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ భారతీయ ఐఐటీ విద్యార్థులు రూపోందించిన కిట్ ఖర్చును అమాతం తగ్గించింది.
కరోనా అంటే ఓ వైపు టెస్టులకు ఏకంగా రెండున్నర వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్న ఆర్థికంగా వెనుకబడిన వారు వ్యాధి సోకినా.. కాషాయాలు, వేడి నీళ్లు తాగి దాని తగ్గించుకుంటున్న క్రమంలో ఇక అలాంటి భయాలకు చెక్ పెట్టేలా కొత్త కరోనా కిట్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ఐఐటీ అత్యంత చవకైన కొవిడ్ టెస్టింగ్ కిట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ. 399 కాగా, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్, శాంపిల్ కలెక్షన్ వంటి వాటితో కలుపుకుని రూ. 700లోపు లభ్యమవుతుంది. కోరోష్యూర్ పేరుతో ఢిల్లీ ఐఐటీకి చెందిన 9 మంది రీసెర్చ్ విద్యార్థులు దీనిని అభివృద్ధి చేశారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, సహాయమంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రామ్గోపాలరావు కలిసి దీనిని విడుదల చేశారు. ఈ కిట్కు ఐసీఎంఆర్ ఆమోదం ఉంది. న్యూటెక్ మెడికల్ డివైజెస్ సంస్థతో కలిసి దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కిట్లో వాడిన అన్ని రకాల పరికరాలు దేశీయంగా తయారైనవేనని ఐఐటీ డైరెక్టర్ రామ్గోపాలరావు తెలిపారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు పరిశోధనలు చేపట్టామని, అశ్వగంధ ఔషధం వైరస్పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించినట్టు ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more