భూమి వివాదంలో రూ.1.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తుల జాబితా చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఆయన కూడబెట్టిన ఆస్తులు ఒక్కటొక్కటే బయపడుతున్నాయి. కోట్లాది రూపాయల లావాదేలీలను ఆయన నెట్ క్యాష్ ద్వారానే జరిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాదు శివారులో ఓ ఖరీదైన విల్లా కొనుగోలుకు శంకరయ్య అడ్వాన్స్ గా రూ.1.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు తేలింది. దానికి సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో 260 గజాల్లో నిర్మించిన జీ ప్లస్ టూ, పెంట్ హౌస్ కోసం కూడా నగదు రూపంలోనే డబ్బులు చెల్లించిట్లు తెలిసింది. అంత పెద్ద మొత్తంలో ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అంతేకాకుండా శంకరయ్య స్టోన్ క్రషర్ వ్యాపారంలో పెద్ద యెత్తున పెట్టుబడులు పెట్టినట్లు వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు మొత్తం ఆరు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు తేలింది. ఆ ఖాతాల లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఎసీబీ అధికారులు బ్యాంకులకు లేఖలు రాశారు. బ్యాంకుల నుంచి ఒకటి రెండు రోజుల్లో సమాచారం రావచ్చునని భావిస్తన్నారు. హైదరాబాదులోని ఓ బ్యాంకులోనే కాకుండా ఆయన గతంలో పనిచేసిన జిల్లాల్లో ఐదు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. శంకరయ్యకు బ్యాంకు లాకర్లు ఉన్నాయా అనే కోణంలో ఏసీబి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి అందే సమాచారం మేరకు ఏసీబి అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.
ట్రాప్ కేసుల పట్టుబడిన శంకరయ్యకు సంబంధించి ప్రాథమిక సోదాల్లో రూ.4.58 కోట్లు విలువైన స్థిర, చరాస్థులు ఏసీబీకి చిక్కాయి. రూ.1.5 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు, రూ.2.28 కోట్ల విలువ చేసే 11 ఇళ్ల స్థలాలు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్, చేవెళ్ల మండలం ముదిమ్యాల, మిర్యాలగుడాల్లో 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.21.14 లక్షల విలువైన బంగారు నగలు, రూ.17.88 లక్షల నగదును ఏసీబి అధికారులు గుర్తించారు. వాటితో పాటు వెండి అభరణాలు, ఇతర విలువైన గృహోపకరణాలను ఏసీబి అధికారులు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more