(Image source from: Telugubulletin.com)
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. ముద్రగడ పద్మనాభం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం కూడా రాజకీయ వర్గాలను కుదిసేసింది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. కాపులను బిసీలలో చేర్చాలన్న డిమాండ్ తో ఉద్యమాన్ని ప్రారంభించిన ముద్రగడ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో చేరి.. ఉద్యమాన్ని ఉద్దృత స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కాపుల రిజర్వేషన్లను అజెండా చేసుకునే స్థాయికి తీసుకెళ్లిన తాను.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్తితుల నేపథ్యంలో తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాట్లు తెలిపారు.
(Image Source: Teluguin.com)
కాపు ఉద్యమంలో చేరిన తాను అన్ని రకాలుగా నష్టపోయానని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని వివరించారు. కాపు ఫలాల సాధన కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నించడం జరిగిందని చెప్పుకొచ్చారు. తాను మానసికంగా దిగజారే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని, వీటితో కలత చెంది ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఉద్యమకాలంలో తను వసూలు చేసిన నిధులు వారికి పంచలేదనే దాడులు చేయిస్తున్నారని, కాపు జాతికి మంచి జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. మన పెద్దలు పేరు చెప్పకుండా..పది మందితో తిట్టిస్తున్నారని వెల్లడించారు. తుని సభ, పాదయాత్ర విజయవంతం తన గొప్పతనం కాదని చెప్పిన ఆయన…నన్ను తిట్టించే వారితోనే రిజర్వేషన్లు సాధించాలని కోరుతున్నానని తెలిపారు.
(Image Source: Teluguin.com)
ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం..కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గుర్తింపు ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలో పనిచేశారు. 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు. 2016 జనవరి, 31న తూర్పుగోదావరి తునిలో కాపు ఐక్య గర్జన సబ ద్వారా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. తునిలోని కొత్తూరు వద్ద జరిగిన ఈ సభ నుంచి ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామని పిలుపునిచ్చారు. రోడ్లు, రైళ్ రోకోలకు పిలుపునివ్వడంతో చాలా మంది హైవేలు, రైల్వే ట్రాక్ లను దిగ్భందించారు. దీని ద్వారా విధ్వంసం చోటు చేసుకుంది. రైళ్లను దగ్ధం చేశారు. కాపు ఉద్యమం కోసం కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంట్లోనే నిరహార దీక్షలకు కూర్చున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more