(Image source from: Financialexpress.com)
కరోనా వైరస్ మహమ్మారి విజృంభనను కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు విధించిన లాక్ డౌన్ లు దేశంలోని అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యావ్యవస్థ అస్త్యవ్యస్తమైంది. 4 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడగా.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏకంగా రద్దయ్యాయి. ఐతే డిగ్రీ, పీజీ పరీక్షలను సైతం రద్దు చేయాలన్న డిమాండ్ అటు విద్యార్థుల నుంచి.. ఇటు వారి తల్లిదండ్రుల నుంచి కూడా వినిపిస్తున్న తరుణంలో తాజాగా ఇవాళ్లి వరకు ఈ పరీక్షలపై సస్పెన్స్ కొనసాగింది. అయితే ఇవాళ కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజా అనుమతుల నేపథ్యంలో సస్పెన్స్ కు తెరపడింది.
అయితే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు కల్పించినట్లు వీరికి పరీక్షలను రద్దు చేయకుండా.. యూనివర్సిటీలు, ఇతర సంస్థల వినతి మేరకు డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు కేంద్రం హోంశాఖ అనుమలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి హోంశాఖ లేఖ రాసింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం, యూనివర్సిటీల అకాడమిక్ క్యాలెండర్ మేరకు ఫైనల్ టర్మ్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన స్లాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది.
కాగా, ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నత విద్య పరీక్షలను రద్దు చేసి.. పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడించాయి. ఐతే గుజరాత్ ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆ ప్రకటనపై యూటర్న్ తీసుకుంది. తాజాగా కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయా యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశముంది. వీలైనంత త్వరలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఓ వైపు కరోనా తన ఉద్దృతిని పెంచుకుంటున్నతరుణంలో మరోవైపు సరికొత్త రూపంలో ప్లేగు వ్యాధి విస్తరిస్తున్న క్రమంలో విద్యార్థుల ప్రాణాలు అత్యంత అమూల్యమైనవని అన్నారు. అయితే పరీక్షల నిర్వహణ తప్పనిసరి అయిన పక్షంలో దానికి కూడా సరికొత్త మార్గాలను అన్వేషించాలని పలువురు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more