దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రభావాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. విదేశాల్లో దీని ప్రభావానికి గురైనవారి సంఖ్య కూడా అధికంగానే వుంది. ఈ నేపథ్యంలో విదేశీప్రయాణాలు చేసేవారిపై ఇప్పటికే లాక్ డౌన్ నాటి నుంచి నిషేధం కొనసాగుతోంది. ఇక విదేశాల నుంచి మన దేశానికి వచ్చేవారిపై కూడా దీని ప్రభావం పడుతోంది. విదేశాల్లో దీని ప్రభావానికి గురైన, కానీ దేశస్థుల కోసం వందే భారత్ పేరుతో కేంద్రం ప్రత్యేక విమనాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అలా వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్, ఐసోలేషన్ లకు తరలివెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కరోనా మహమ్మారి పంజా విసరుతున్న క్రమంలో విదేశీయానం చేసేవారికి మాత్రం ఇది చేదు వార్తే.
కరోనా ఉద్ధృతి కట్టడి చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ నెలలో విదేశీయానాలకు విహంగాలు ఎగురుతాయని ముందస్తుగా చేసిన ప్రకటనను తాజాగా కేంద్ర పౌరవిమానాయాన శాఖ ఉపసంహరించుకుని కొత్తగా సవరణలను తీసుకువచ్చింది. వీదేశీ విమాన సర్వీసుల రద్దును జులై 31 వరకు కొనసాగిస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్ని నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 15 వరకు పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
అయితే, అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు ప్రయాణికుల విమాన సర్వీసులకు సంబంధించి ఆయా దేశాల విమానయాన శాఖలు సంప్రదింపులు జరుపుతున్నట్టు డీజీసీఏ ఛైర్మన్ అరవింద్ సింగ్ తెలిపారు. పౌర విమనాయానశాఖ కూడా అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ద్వైపాకిక్షక సర్వీసులు నడపడంపై దృష్టి సారించినట్టు తెలిపింది. ప్రస్తుతం వందే భారత్ మిషన్లో భాగంగా మే 6 నుంచి ఎయిండియాతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు యథాతథంగా నడుస్తున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more