కరోనా వైరస్ మహమ్మారి విశ్వవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తూ కోటి మందికి పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేసి.. ఐదు లక్షల మంది ప్రాణాలను కబళించి వేసింది. దీంతో దాదాపుగా అన్ని వ్యవస్థలు, రంగాలలో మార్పులు కూడా సంక్రమించాయి. అయితే మహమ్మారి ప్రభావం చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థగా బాసిల్లుతున్న భారత ఎన్నికలపై కూడా పడింది. కరోనా ప్రభావం నేపథ్యంలో రాష్ట్రల్లో ఎన్నికల నిర్వహణ విషయంలోనూ మార్పులు తీసుకువచ్చింది భారత ఎన్నికల సంఘం. దీంతో ఇప్పటి వరకు కేవలం ఎన్నికల విధుల్లో పాల్గోనే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు మాత్రమే పరిమితమైన పోస్టల్ బ్యాలెట్ కు కూడా మంచి బలం వచ్చింది.
అదెలా అంటే తాజాగా కేంద్ర ఎన్నికల కమీషన్ కరోనా నేపథ్యంలో తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా ఇకపై 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చింది. వీరితో పాటు మధుమేహం, రక్తపోటు ఉన్న వారు, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వున్నవారికి.. వీటితో పాటు అరోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నవారికి కొవిడ్-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో వారికి పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయడం నుంచి మినహాయింపు కల్పించడంతో పాటు వారి ఓటుహక్కును మాత్రం పధిలం చేయాలన్న సంకల్పించడంతో సీఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. వైరస్ విజృంభణ దృష్ట్యా ఏదేమైనప్పటికీ వృద్ధులు బయటకొచ్చేందుకు అనుమతి ఇవ్వకూడదని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారే కాకుండా మధుమేహ రోగులు, రక్తపోటుతో బాధపడుతున్న వారు, గర్భిణులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయుక్తంగా ఉండనుంది. గతంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం 80 ఏళ్లకు పైబడినవారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది. ఇప్పుడు 80 నుంచి 65 ఏళ్లకు కుదించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more