అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ కు గత నెల రోజులుగా డిమాండ్ పేరుగిన క్రమంలో దేశంలో ఇంధన ధరలు కూడా అంతకంతకూ అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ఏకంగా రెండేళ్ల గరిష్టస్థాయిని కూడా అందుకుని మరింతపైకి ఎగబాకుతున్నాయి. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ ధరలు కలుపుకుని ఏకంగా 64శాతం మేర పొందుతున్నాయని, ఇక వాహనదారుడికి మాత్రం అంతర్జాతీయ మార్కట్ ధరల లభ్దిని చేకూర్చకుండా.. వాయింపులను మాత్రం మోయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. సంస్థలు ధరల పెంపుపై వెనక్కు తగ్గడం లేదన్న వాదనలు వినిపించాయి. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 100 ప్లస్ డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. కానీ అంతర్జాతీయంగా ధరలు సాధారణంగా కొనసాగుతున్నా.. మన దేశంలో మాత్రం వరుసగా ఇరవై ఒక్క రోజులుగా పెరుగిన ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.14 శాతం పెరుగుదలతో 41.73 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 1.35 శాతం పెరుగుదలతో 39.80 డాలర్లకు ఎగసింది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాల్సిన చమురు సంస్థలు ఇవాళ ధరల పెంపుకు విరామాన్ని ప్రకటించాయి. గత మూడు వారాలుగా ఇప్పటికే పెట్రోల్ పై పది రూపాయల మేర ధర పెరగ్గా, డీజిల్ పై పదకోండు రూపాయల మేర దర పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి.
దేశంలో గత మూడు వారాలుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గత ఆదివారం ఒక్కరోజు ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం మళ్లీ బాదుడు మొదలైంది. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత ఇవాళ బుధవారం పెట్రో ధరల నుంచి వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ కూడా ధరల పెంపుకు ఇంధన కంపెనీలు విరామం ప్రకటించాయి, దీంతో నిన్నటి ధరల వద్దే పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.80.53 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.87.19 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.83 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. దేశీ ఇంధన ధరలు ఈరోజు కూడా స్థిరంగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే రూ.78.69 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర ధర రూ.83.82 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.98 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.83.43 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.62 వద్ద నిలకడగానే కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more