10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కులను ప్రకటించే పనిలో నిమగ్నమైంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా విద్యార్థులకు మార్కుల్ని వేయనుంది సీబీఎస్ఈ. మూడు పేపర్స్ అసెస్ మెంట్ ద్వారా ఈ మార్కులు ఉంటాయి. జూలై 15 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనుంది సీబీఎస్ఈ. ఈ ఫలితాల ఆధారంగానే విద్యార్థులు పై తరగతులకు అడ్మిషన్లు పొందొచ్చు. 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే మార్కులను ప్రకటించనుంది బోర్డు.
అయితే 12వ తరగతి విద్యార్థులకు మాత్రం మార్కులు ప్రకటించిన తరువాత వాటిని మెరుగుపర్చుకునే అవకాశం కుడా కల్పించింది. ప్రస్తుతం విద్యార్థులకు ఇచ్చే మార్కులతో వారు సంతృప్తి చెందని పక్షంలో మరోమారు విద్యార్థులు ఇప్రూవ్ మెంట్ పరీక్షలు రాసుకునేలా అవకాశాన్ని కల్పించింది. ఈ ఆప్షన్ ఎంచుకునేందుకు విద్యార్థులకు సీబీఎస్ఈ కొన్ని రోజుల సమయం ఇస్తుంది. ప్రస్తుతం జూలై 15న పదో తరగతి, 12వ తరగతి పలితాలు వెల్లడైన తరువాత మరొికొన్ని రోజుల సమయం ఇచ్చిన తరువాత పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్షలను నిర్వహించనుంది సీబీఎస్ఈ. అయితే ఆ పరీక్షలు ఎప్పుడు ఉంటాయన్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తుంది బోర్డు.
కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 10, 12వ విద్యార్థుల తల్లిదండ్రుల పిటీషన్ నేపథ్యంలో స్పందించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. జూలై 1 నుంచి 15 మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు కూడా తేదీలను ఖరారు చేసింది. అయితే కరోనా విజృంభన నేపథ్యంలో తమ పిల్లలను పరీక్షలకు ఎలా పంపుతామని పలువురు తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీంతో తల్లిదండ్రుల అవేదన, అందోళన నేపథ్యంలో అందుకు తగిన రీతిన స్పందించి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన క్రమంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్ుల ప్రకటించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more