కరోనా వైరస్ సంక్షోభం కారణంగా బ్యాంకులు తమ కస్టమర్లకు అనేక సడలింపులు ఇచ్చాయి. వీటిలో భాగంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉపసంహరణకు నిబంధనల్ని మార్చి కస్టమర్లకు ఊరట కలిగించాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజలు నగదు లేకుండా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో బ్యాంకులు కస్టమర్ల సౌలభ్యం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం సర్వీస్ ఛార్జీలను తొలగించింది. అంటే ఉచిత ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే ప్రతీ సారి సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉండేది. కానీ లాక్ డౌన్ కాలంలో ఈ ఛార్జీలను ఎస్బీఐ తొలగించింది. ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే కాదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలో డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది.
అయితే ఈ నెలాఖరుతో ఈ తరహా లావాదేవీలకు మినహాయింపులు ముగియనున్నాయి. అయితే బ్యాంకులు కానీ, ఆర్టీఐ కానీ ఇప్పటి వరకు ఏటీయం కేంద్రాల్లో లావాదేవీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జూన్ 30 వరకు ఏటీఎం సర్వీస్ ఛార్జీలు లేవని ముందే స్పష్టం చేయగా, ఆ తరువాత మళ్లీ అంతకుముందు కోనసాగిన నిబంధనలే వర్తిస్తాయా.? లేక పోడిగింపు వర్తించనుందా అన్న విషయంలో ఇంకా సంగ్ధిధత నెలకొంది. ఎస్బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. ఇప్పటివరకైతే ఈ సడలింపుల పొడిగింపుపై బ్యాంకుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి జూలై 1 నుంచి గతంలో ఉన్న ఏటీఎం క్యాష్ విత్డ్రాయల్ రూల్స్ అమలులోకి వచ్చే అవకాశముంది.
జూలై 1 నుంచి అన్ని బ్యాంకులు తమ ఏటీఎం విత్డ్రాయల్ నిబంధనల్ని తిరిగి అమలు చేయొచ్చు. అదే జరిగితే కస్టమర్లకు ఏటీఎం విత్డ్రా లిమిట్ తగ్గిపోతుంది. ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో ఉన్నట్టే ఉంటుంది. ఎస్బీఐ విషయానికొస్తే మెట్రో నగరాల్లో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి 8 ఉచిత ట్రాన్సాక్షన్స్ని ఇస్తోంది బ్యాంకు. 5 సార్లు ఎస్బీఐ ఏటీఎంలల్లో, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. నాన్ మెట్రోలో 8 ఉచిత ట్రాన్సాక్షన్స్ని ఇస్తోంది ఎస్బీఐ. 5 సార్లు ఎస్బీఐ ఏటీఎంలల్లో, 5 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇంతన్నా ఎక్కువసార్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ప్రతీ లావాదేవీపై రూ.20+జీఎస్టీ చెల్లించాలి. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్కు రూ.8+జీఎస్టీ చెల్లించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more