కరోనా వైరస్ వ్యాప్తి ఉద్దృతి రాష్ట్రంలో అధికం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ పరీక్షలతో పాటు ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంసీఏ సహా ఐటిఐ పరీక్షలను కూడా రద్దు చేయాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడంతో.. కేవలం గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేనాని కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని కోరిన నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో కీలక నిర్ణయాన్ని తీసుకుని ఆ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా పవన్ కోరిన వెంటనే డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది.
ఇవాళ ఉదయం పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన జనసేన పేరిట తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ప్రకటన ద్వారా కోరారు. పదో తరగతి విద్యార్థులకు కల్పించిన విధంగానే డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఎంబీఏ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ వంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్ధులకు కూడా పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఈ విద్యార్థులకు కూడా ఇంటర్నల్ మార్కులతో పాటు గత సెమిస్టర్ల మార్కులను జతచేసి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల మేలు కోరి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
కాగా ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చివరి సెమిషర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more