Minister seeks suggestions on conduct of UG, PG exams పవన్ కల్యాణ్ కోరిక తీర్చిన జగన్ సర్కార్.. విద్యార్థులు ఫుల్ హ్యాపీ

Andhra pradesh minister seeks suggestions on conduct of ug pg exams

Pawan Kalyan, YSRCP Government, Education Minister Adimulapu Suresh, Under Gradutes, post Graduates, Degree, IITans, ITIans, Engineering students, 10th class students, 10th class exams, 10th results, Intermiediate supplimentary exams, inter supplimentary exams, coronavirus, JanaSena, Twitter, Andhra Pradesh, Politics

Andhra Pradesh Education Minister Adimulapu Suresh on Tuesday invited suggestions and advice on conduct of the examinations of degree and post-graduate courses in view of the rising number of Coronavirus cases.

డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేసిన ఏపీ సర్కార్.. పవన్ కల్యాణ్ కోరిన వెంటనే..

Posted: 06/24/2020 12:24 AM IST
Andhra pradesh minister seeks suggestions on conduct of ug pg exams

కరోనా వైరస్ వ్యాప్తి ఉద్దృతి రాష్ట్రంలో అధికం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ పరీక్షలతో పాటు ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంసీఏ సహా ఐటిఐ పరీక్షలను కూడా రద్దు చేయాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడంతో.. కేవలం గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేనాని కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని కోరిన నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో కీలక నిర్ణయాన్ని తీసుకుని ఆ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా పవన్ కోరిన వెంటనే డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది.

ఇవాళ ఉదయం పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన జనసేన పేరిట తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ప్రకటన ద్వారా కోరారు. పదో తరగతి విద్యార్థులకు కల్పించిన విధంగానే డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ వంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధమైన విద్యార్ధులకు కూడా పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఈ విద్యార్థులకు కూడా ఇంటర్నల్ మార్కులతో పాటు గత సెమిస్టర్ల మార్కులను జతచేసి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల మేలు కోరి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

కాగా ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్‌లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చివరి సెమిషర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles