దేశ సరిహద్దులో మరోమారు కాల్పుల కలకలం రేగింది. తెల్లవారు జామున ప్రజలు గాఢనిద్రలో తుపాకుల మోతకు ఉలిక్కిపడి నిద్రలేచారు. పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రభూత సంతతికి చెందిన ముష్కరులు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేయగా, వారు స్థానికంగా నక్కిన విషయాన్ని ఉప్పందుకున్న భారత ఆర్మీ, జమ్మూ-కాశ్మీర్ బలగాలు వారిని వెంటాడి మట్టుబెట్టాయి. జమ్మూ-కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్. భారత ఆర్మీ, పోలీసుల సంయుక్త ఆపరేషన్ ఆద్వర్యంలో జిరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. కాగా ఈ ఎన్ కౌంటర్లో భారత్ కు చెందిన ఓ సీఆర్పీఎప్ జవాను కూడా అసువులుబాసాడు.
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం సీఆర్పీఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. అయితే పోలీసులతో పాటు భారత భద్రతా దళాలు కూడా రంగంలోకి దిగి స్థానికంగా జల్లోడ పట్టారు. ఈ క్రమంలో తప్పించుకునే మార్గం లేక స్థానికంగా నక్కిన ముష్కరులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపి ఇద్దరు తీవ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి.
ఆర్మీ 55వ రాష్ట్రీయ రైఫిల్స్, 182 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఒక ఇంట్లో నక్కిన తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఎదురుకాల్పుల ఘటనల్లో హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఆర్మీ జవాన్లు కూడా షూటింగ్ ప్రారంభించారని, ఈ క్రమంలోనే ఇద్దరు తీవ్రవాదులు, ఒక జవాన్ మృతిచెందారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అక్కడ కొన్ని తుపాకులతో పాటు బులెట్లు, మందుగుండు సామాగ్రి దొరికినట్లు ఆయన తెలిపారు. ఇటీవల పింజోరాకు 12 కి.మీ దూరంలో ఉన్న రెబన్ ప్రాంతంలో ఐదుగురు, ఆ తరువాత నలుగురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more