(Image source from: Newsbytesapp.com)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందకు పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు ఏడు వేల మార్కును దాటాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా రెండువందల సంఖ్యలో కరోనా కేసులు రాష్ట్రంలో నిర్థారణ అవుతున్నాయి, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ రెండు వందలకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదువందలకు చేరువలో కేసులు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.
తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85వందల మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 491 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తంగా 8452కు చేరాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన 18 మందికి, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన 89 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 107గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 394 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగతా కేసులు పలు జిల్లాల్లో్ వెలుగుచూసిన కాంట్రెక్టు కేసులని సమాచారం.
దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 8452 మందికి కరో్నా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో మరణాలు కూడా క్రమంగా ప్రతీ రోజు నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఐదుగురు అసువులు బాసారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 101కి చేరింది. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4111కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 4240గా నమోదు అయ్యింది.
శ్రీకాకుళం, ప్రకాశం. అనంతపురం మూడు జిల్లాలో ఆదివారం అనగా ఈ నెల 21 నుంచి వారం రోజులు పాటు లాక్ డౌన్ మరింత కఠినంగా విధించనుంది. ఈ విషయాన్ని ఆయా జిల్లా యంత్రాగాలు ప్రకటించాయి, కరోనాకు గ్రీస్ జోన్ గా బాసిల్లిన శ్రీకాకుళం జిల్లాతో పాటు ప్రకాశం, అనంతపురం జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు తమ ఉధృతిని చాటుకోవడంతో.. అధికారయంత్రాంగం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరించారు. ప్రభుత్వ అనుమతితో రేపటి నుంచి వారం రోజుల పాటు పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయనున్నారు, నిత్యావసర సరుకులకు కూడా కేవలం ఉదయం పూట ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతులు ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్న జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆ దేశాలు జారీ చేశారు. ఇక, ప్రకాశం జిల్లాలో వైరస్ వ్యాప్తితో ఎక్కువగా ఉన్న ఒంగోలు, చీరాలలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గలను తొలుత కట్టడి ప్రాంతాలుగా గుర్తించి.. లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more