(Image source from: Newindianexpress.com)
అంతర్జాతీయంగా ఇంధనాని డిమాండ్ పెరుగుతుండటంతో ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ టో గత నెలలో వున్న ఇరవూ డాలర్ల బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర రెట్టింపు ధర కన్నా అధికస్థాయికి చేరడంతో ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు ఏడాది గరిష్టస్థాయిని అందుకున్నాయి. ఇదే క్రమంలో వరుసగా పదకొండు రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీంతో ఏకంగా ఏడాది గరిష్టస్థాయికి ఇంధన ధరలు చేరుకున్నాయి. గత పదకొండు రోజులుగా పెరుగుతున్న ధరలతో ఇంధనంపై ఏకంగా ఆరు రూపాయాల మేర పెరిగింది. ఇక తాజా పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర హైదారాబాదులో ఏకంగా రూ.80 దాటగా, అమరావతిలో ఏకంగా రూ.81కి చేరింది.
పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్రప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత సేవలు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇక ఇటీవలే ఇంధన సంస్థలు కూడా తమకు ఇంధన రవాణాలో లీటరుకు ఎనమిది రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తున్నామని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరి.. నష్టాలను భర్తీ చేసుకున్న క్రమంలోనూ ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. ఇటు పెట్రోల్ తో పాటు ఆటు డీజీల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు కూడా పెరుగుతున్నాయి.
దేశంలో లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలతో పోల్చితే గత నెలలో ఇంధన ధరల వినియోగం పెరిగిందని, గత నెలలో ఏకంగా రెట్టింపు వినియోగం అయ్యిందని దేశ అతిపెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా పన్నెండవ రోజూ ధరలు పెరిగాయి. తాజాగా ఇవాళ గురువారం నాడు లీటరు పెట్రోలుపై 55 పైసలు, లీటరు డీజిల్ పై 64 పైసల ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో గత పన్నెండవ రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ.6.55 మేర.. డీజిల్ పై రూ. 7.04 మేర పెరిగినట్లయింది.
ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ.77.81కి, డీజిల్ ధర రూ.76.43కు చేరగా, గుర్గావ్ లో పెట్రోల్ ధర 76.51, డీజిల్ 69.02, ముంబైలో పెట్రోల్ రూ.84.66కి, డీజిల్ 74.93కు, కోల్కతాలో లీటరు పెట్రోలు రూ.79.59, డీజిల్ ధర రూ.71.96కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 80.86. డీజిల్ రూ. 74.96కు పెరుగగా, బెంగళూరులో పెట్రోల్ రూ. 80.33. డీజిల్ రూ. 72.74కి, హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 80.77. డీజిల్ రూ. 74.71కు, అమరావతిలో పెట్రోల్ రూ. 81.21. డీజిల్ రూ. 75.26కు చేరుకున్నాయి. ఇక అటు గుజరాత్ లో మాత్రం ఇంధన ధరలు మరో రెండు రూపాయల మేర పెరిగాయి. కోవిడ్ నష్టాలను పూడ్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం వ్యాట్ ను రెండు రూపాయల మేర పెంచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more