లడఖ్ లోని గాల్వన్ లోయలో వద్ద సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణలో వీరమరణం పోందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి ఇవాళ సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంతోష్ బాబు అంత్యక్రియలు నిన్నే జరగాల్సివున్నా.. సంతోష్ బాబు స్వగ్రామానికి ఆయన పార్థీవ దేహం రావడానికి ఆలస్యమైంది. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆయన పార్ధీవదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో బుధవారం జరగాల్సిన అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి, సూర్యపేటలోని కేసారంలో సంతోష్బాబు కుటుంబానికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ టి. వినయ్కృష్ణారెడ్డి తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో సంతోష్ బాబు అంత్యక్రియలకు కూడా పరిమితమైన సంఖ్యలోనే బంధువులను అనుమతించనున్నట్లు సూర్యాపేట కలెక్టర్ తెలిపారు. ఇక ఈ నిబంధనలు అమల్లో వున్నందున.. ఇప్పటికే పలువురు ప్రముఖుల ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి తమ తీవ్ర సానుబూతిని వ్యక్తం చేశారు. ఇక ఇవాళ ఉదయం కూడా ఆయన పార్థీవదేహాన్ని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించారు.
వీరితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రితం రోజునే సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, ప్రజల సందర్శనార్థం కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఈ ఉదయం 10 గంటల వరకు ఉంచనున్నట్టు పేర్కొన్నారు. పార్థివ దేహాన్ని సందర్శించే క్రమంలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more