రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో తమిళనాడు ప్రభుత్వానికి శరాఘాతంలో పరిణమించింది,. ఇది ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయనుందని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో అటు వాటి నుంచి తప్పించుకునేందుకు.. ఇటు ప్రజలు ప్రాణాలను కూడా పరిరక్షించేందుకు తరుణోపాయంలా కనిపిస్తున్న లాక్ డౌన్ ను మళ్లీ రాష్ట్రంలో విధించాలని యోచిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కరోనా కేసుల ప్రభావం అధికంగా వున్న రాజధాని చెన్నై సహా నాలుగు జిల్లాల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి 30 వరకు ఈ నాలుగు జిల్లాల్లో పూర్తిస్థాయిలో సంపూర్ణంగా లాక్ డౌన్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి నిర్ణయించారు. సీనియర్ ఉన్నతాధికారులతో ఈ నిపుణుల కమిటీ దాదాపు గంటకు పైగా సమావేశమై చర్చించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య, వైద్య నిపుణుల బృందం ప్రభుత్వానికి సూచించింది. అందుకుగానూ ప్రభుత్వానికి పలు కీలక సూచనలను సైతం చేసింది. దీంతో సమావేశంలో రాస్ట్రంలోని కిలకమైన నాలుగు జిల్లాలో లాక్ డౌన్ విధించనున్నట్లు సీఎం పళనిస్వామి వెల్లడించారు. చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్ పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో జూన్ 19 నుంచి 30 వరకు కఠిన లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అముల చేయనున్నామని చెప్పారు.
ఈ జిల్లాలన్నీ చెన్నై మహానగరం పరిధిలోవే కావడం అందునా మెట్రోపోలిటిన్ పోలీస్ పరిధిలోనివే కావడం గమనార్హం. తాజా లాక్ డౌన్ కొనసాగే 12 రోజుల్లో వచ్చే రెండు ఆదివారాల్లో మాత్రం పూర్తిస్థాయి లాక్డౌన్ ఉంటుందని సీఎం స్పష్టంచేశారు. ఆ రెండు రోజుల్లో మాత్రం వేటికీ మినహాయింపులు ఉండబోవన్నారు. దేశంలో నమోదైన అత్యధిక కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. నిన్నటివరకు ఆ రాష్ట్రంలో 44,661 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 430మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో 24,547మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
* నిత్యావసర సర్వీసులకు మినహాయింపు
* ఎమర్జెన్సీలో తప్ప అద్దె క్యాబ్లు, ఆటో సర్వీసులకు అనుమతిలేదు.
* ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం ఉద్యోగులతో పనిచేస్తాయి.
* కంటైన్మెంట్ జోన్ల పరిధిలో నివసించే ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు.
* జూన్ 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
* కూరగాయల దుకాణాలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే పనిచేస్తాయి.
* హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు పనిచేస్తాయి. అయితే, పార్శిల్స్కు మాత్రమే అనుమతి.
* రేషన్, నిత్యావసర సరకుల దుకాణాలు, మొబైల్ షాప్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేస్తాయి.
* టీ దుకాణాలకు అనుమతిలేదు.
* ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు మినహాయింపు.
* అమ్మ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచన్లు యథాతథంగా పనిచేస్తాయి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more