294 deaths in india highest single-day jump 24 గంటల్లో పదివేల కేసులు.. 300 చేరువలో మరణాలు

9887 covid 19 cases in india in 24 hours 294 deaths in highest single day jump

Coronavirus in india, coronavirus india news, coronavirus latest news, coronavirus news, coronavirus news today, coronavirus update, coronavirus, india, coronavirus cases in india, coronavirus deaths in india, health ministry, Maharashtra, Delhi

India's tally of the coronavirus disease (Covid-19) surged to 246,657 after 9,887 new cases and 294 deaths, the highest so far, the Union health ministry data showed.There are 115,942 active cases of Covid-19 and 114,072 people have been cured of the highly-infectious disease so far.

దేశంలో కరోనా విజృంభన.. 24 గంటల్లో పదివేల కేసులు.. 300 చేరువలో మరణాలు

Posted: 06/06/2020 08:51 PM IST
9887 covid 19 cases in india in 24 hours 294 deaths in highest single day jump

(Image source from: Hindustantimes.com)

దేశంలో కరోనా విజృంభన మరింత వేగాన్ని అందుకుంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకూ తన వ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావానపడిన దేశాల్లో ఆరవ స్థానంలో భారత్ నిలిచింది. వారం రోజుల క్రితం టాప్ టెన్ దేశాల జాబితాలో చేరిన భారత్.. ఇదే స్థాయిలో వ్యాప్తిని కొనసాగిస్తే మరో వారం రోజుల్లో నాలుగవ స్థానంలో వున్న స్పెయిన్ దేశాన్ని కూడా అధిగమించే ప్రమాదముంది. దేశంలో జనవరి 30న తొలి కేసు నమోదైన తరువాత విడతల వారీగా లాక్ డౌన్ విధిస్తూ చర్యలు తీసుకుంటున్న కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు కరోనాను కీలక దశలో కట్టడి చేశాయి. ఇక అర్థిక ప్రగతి కుంటుపడుతున్న నేపథ్యంలో సడలింపులతో వెసలుబాటు కల్పించగానే.. వరుసగా రోజురోజుకు అత్యధిక కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది.

గత రెండు రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు, ఇక తాజగా ఇవాళ ఏకంగా పది వేలకు చేరువలో నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతీ రోజు రెండు వందలకు పైబడే మరణాలు నమోదు కావడం కూడా అందోళన వ్యక్తం అవుతోంది. అటు దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు కూడా అందోళన కలిగించే స్థాయికి చేరువవుతున్నాయి. ఐదో విడత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దేశంలో అన్నింటికీ సడలింపులు వచ్చాయి. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 9887 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 246,657 కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవిస్తూ ప్రజలను అందోళనకు గురచేస్తున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 294 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 6600 మార్కును దాటింది. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 6642కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో  మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి.

ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,14,072 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,15,942 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 48శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2436 కేసులు నమోదయ్యాయి, ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, గత వారంరోజులుగా మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 80229కు చేరగా, ఏకంగా 2849 మార్క దాటి మరణాలు నమోదయ్యాయి. 

ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న తమిళనాడులో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 1438 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 28694కు చేరాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 1330 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 26334 చేరగా, మొత్తంగా 708 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నమొత్తం కేసులు సంఖ్య 19,094కి చేరగా, ఏకంగా 1190 మంది అసువులు బాసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles