Telangana reports 117 Cororna Cases in 24 hours తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో.. 117 కేసులు..

Covid 19 update with 117 cases telangana records highest single day spike

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The coronavirus positive cases in Telangana State have hit a new high with health authorities on Thursday reporting 117 Covid-19 positive cases and six fatalities. The cumulative tally of Covid-19 infections so far in Telangana State has also reached the 2256 mark.

కరోనా విజృంభన: తెలంగాణలో 24 గంటల్లో అత్యధిక కేసులు..

Posted: 05/29/2020 12:05 AM IST
Covid 19 update with 117 cases telangana records highest single day spike

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసులకు తోడు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో కూడా కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్యాధికారులు, డాక్లర్లు ఎంతగానో శ్రమిస్తున్నా.. ఉపశమనం లభించే వాతావరణం మాత్రం అప్పుడే కనిపించడం లేదు. మరణాలు కూడా అంతకంతకూ పెరగుతూ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది.  

ఈ ఏప్రిల్ మాసంలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకున్నా.. వ్యాప్తి మాత్రం అగడం లేదు. దీంతో గ్రేటర్ వాసులను మరింత అందోళనకు గురిచేస్తోంది. ఇవాళ తాజాగా నాలుగు మరణాలు సంభవించాయి. దాంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 67కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం. ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు కూడా కలవరాన్ని రేపుతున్నాయి.

బుధవారం విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. నిన్న 107కేసులు నమోదైన తెలంగాణలో ఇవాళ ఏకంగా 117 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలో ఒక్కరోజులో కేసులు నమోదు కావడం ఇదే అత్యధికం. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 2256కి చేరుకున్నాయి. వీటిలో అత్యధిక కరోనాకేసులు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారివే కావడం గమనార్హం, ఇక రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు కూడా కరోనా పాజిటివ్ వచ్చినవారి జాబితాలో వున్నారు. మొత్తం 117 కేసుల్లో 49 కరోనా కేసులు సౌధీ అరేబియా నుంచి వచ్చినవారివే. ఇక ఇద్దరు వలస కార్మికులకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. కాగా, ఇవాళ రాష్ట్రంలో 66 మంది స్థానికులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 117 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 2256 కేసులు నమోదయ్యాయి, ఇక ఇవాళ రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికంగానే సంభవించాయి, ఇవాళ ఏకంగా నలుగురు కరోనా బారిన పడి చికిత్స పోందుతూ అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 67కు చేరింది. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని 23 మంది డిశ్చార్జ్‌ అవగా.. ఇప్పటివరకు 1,345 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 844 యాక్టివ్‌ కేసులు వున్నాయని వారంతా గాంధీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles