నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుని స్థానికులను హడలెత్తించిన చిరుత.. అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటోంది. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దానిని పట్టుకునేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటిని అధిగమిస్తూ గత ఆరు రోజులుగా చిరత చిక్కకుండా పారిపోతోంది. రెండు రోజుల క్రితం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లో నీళ్లు తాగుతూ కనిపించిందని కొందరు జాలర్లు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. అయినా తెలివిగా వ్యవహరించిన చిరుత తప్పించుకుంది.
ఇక తాజాగా మరోమారు చిరుత అచూకీ లభ్యమైంది. కానీ చిరుత మాత్రం తప్పించుకుంది. తాజాగా హిమాయత్సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్లోని స్విమ్మింగ్ పూల్లో నీళ్లు తాగుతుండగా.. వాచ్ మెన్ గమనించి హడలెత్తిపోయాడు. వెంటనే చిరుత ఆచూకీ గురించి స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించారు. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. చిరుత జాడను ఖచ్చితంగా కనిపెట్టేందుకు గార్డెన్స్లోకి కుక్కలను వదిలి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మేకను ఎరవేసిన బోనుతోపాటు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గత గురువారం హైదరాబాద్ శివార్లలోనే కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద నడిరోడ్డుపై చిరుత విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. చాలా సేపు అది అలా పడుకొని ఉండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఫోన్లలో వీడియోలు తీశారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకునే సరికి అది తప్పించుకొని పక్కన ఉన్న ఫామ్ హౌస్ పొదల్లోకి పారిపోయింది. ఫామ్ హౌస్లో ఉన్న చిరుతను పట్టుకోవడం కోసం డ్రోన్లతో గాలించారు. మేకలను ఉంచి రెండు బోన్లను ఏర్పాటు చేయడంతోపాటు.. కుక్కలను వదిలారు. ట్రాప్ కెమెరాలతో దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. కానీ ఫామ్ హౌస్ గోడ దూకి వెళ్లిన చిరుత అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా తప్పించుకొని పారిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more