దేశ న్యాయ వ్యవస్థపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన అరోపణలు చేశారు. దేశంలో ప్రస్తుతం న్యాయవ్యవస్థ ధనికులకు, శక్తివంతులకు అనుకూలంగా మారిందని త్వరలో పదవీ విరమణ చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ధనవంతుడి కేసులలో న్యాయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుందని, పేదలకు సంబంధించిన వ్యాజ్యాల విచారణ మాత్రం ఆలస్యం అవుతుందని అన్నారు. మూడేళ్లుగా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న దీపక్ గుప్తా..తన పదవీ విరమణ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడ్కోలు పొందిన మొదటి న్యాయమూర్తిగా గుప్తా చరిత్రలో నిలిచారు.
చట్టాలు, న్యాయ వ్యవస్థ ధనవంతులు, శక్తివంతమైనవారికి అనుకూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ధనవంతులు, శక్తివంతులు ఎవరైనా నిందితులుగా ఉంటే.. మరో ఉత్తర్వు వచ్చేంతవరకు ఉన్నత న్యాయస్థానాలను వారు ఆశ్రయించగలుగుతారు. సివిల్ వ్యాజ్యాలను ఆలస్యం చేయాలనుకుంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లగలుగుతారు. విచారణను కావాలని ఆలస్యం చేయగలరు. ఇది ఖర్చుతో కూడుకున్నది గనుక పేదలు అలా చేయలేనని గుప్తా అన్నారు. ఉష్ట్రపక్షిలాగా తల దాచిపెట్టుకుని న్యాయవ్యవస్థలో అంతా బాగానే ఉందని అనుకోవడం మంచిది కాదని, అందులోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు కృషి చేయాలని న్యాయమూర్తులకు సూచించారు.
న్యాయవ్యవస్థపై గొప్ప నమ్మకం ఉన్న మన దేశంలో దాని సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతా బావుందనే ఊహాలోకంలో న్యాయమూర్తులు ఉండకూడదని హితవు పలికారు. మైనర్ భార్యతో శృంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more