కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ రెండు విడతలు మందువాసన తగలని మద్యం ప్రియులకు.. మూడోవిడతతో వచ్చిన సడలింపులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో అదను చూసి మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెట్టిపనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. అయినా నలబై రోజుల తరువాత అందుబాటులోకి వచ్చిన మద్యాన్ని కొనుగోలు చేసుకునేందుకే మందుబాబులు సుముఖత వ్యక్తం చేశారు. ఇక వీరి అనందానికి కట్టలు వేయడం చివరాఖరకు ప్రభుత్వానికి కూడా సాద్యపడలేదు. దీంతో మరోమారు ధరలను పెంచాలని.. దీంతోనే మందుబాబులను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు వినబడుతున్నాయి.
మద్యం దుకాణాలకు పోటెత్తిన మద్యం ప్రియులను కట్టడి చేసేందుకు ఇక ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ధరలకు మళ్లి పెంచనుంది. మద్యం విరివిగా తాగే వారి సంఖ్యను మరింత తగ్గించాలని భావించిన ప్రభుత్వం మద్యం ధరలను యాభై శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా మరో 50 శాతం మేర ధరలను పెంచాలని నిర్ణయించింది. పెరిగిన ధరలు ఇవాళ్లి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని 15 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని కూడా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులకు అదేశాలు జారీ చేసిందని సమాచారం. ఇక పెరిగిన ధరలపై ఉత్తర్వులు వెలువడే వరకు రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలను అధికారులు మూసివేయించారు.
నిన్న తాజాగా మద్యం దుకాణాలను నలభై రోజుల తరువాత తెరవడంతో 25శాతం మేర ధరలను పెంచడంతో మద్యం ధరలు బాగా పెరిగాయి, ఇక తాజాగా 50శాతం మేర ధరలు పెరగడంతో ధరలు అమాతం పెరగనున్నాయని.. లాక్ డౌన్ కు ముందు రూ. 120 పలికే మద్యం ధర ఏకంగా రెండు వందల వరకు ధర పలికే అవకాశం వుంటుందని, ఇక రూ. 150 వుండే మద్యం సీసాపై రూ.250 అపైన ధర పలికే అవకాశం వుంటుందని, ఇక 150 కన్నా అధికంగా వున్న క్వార్టర్ ధర కూడా 300 వరకు పలకనుందని తెలుస్తోంది. ధరల పెంపుతో మద్యాన్ని తాగాలన్న తాగేందుకు సరిపడా డబ్బులేక కొంచెం కొంచెంగా మద్యాన్ని తాగడం.. చివరకు మద్యం త్యజిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more