లాక్ డౌన్ సమయంలో బయటికి రావొద్దన్నందుకు వాలంటీరుపై దాడి చేసిన ఘటన కందిరివలసలో చోటుచేసుకుంది. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో వారం తరువాత వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు కూడా తమ వంతు బాధ్యతగా ఆయా గ్రామాల్లో లాక్ డౌన్ ను పకడ్బంధీగా అమలు చేసేందుకు పోలీసులకు సహకరిస్తున్నారే. ఈ క్రమంలో విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని కదిరివలస గ్రామంలో వాలెంటీర్ కూడా లాక్ డౌన్ లో ఇళ్లు వదిలి బయటకు రావద్దని గ్రామస్థులకు సూచించడంతో వారు దాడి చేయడంతో వారం రోజులుగా అసుపత్రిలో చికిత్స పోందుతూ మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పనుకువలస పంచాయతీ కందిరివలస గ్రామ వాలంటీరు కోన లక్ష్మణరావు (23) ఈ నెల 18న కరోనాపై ఇంటింటికి అవగాహన కల్పిస్తూ.. ఎవరూ బయటకు రాకూడదని సూచించాడు. కరోనా వ్యాధి అత్యంత ప్రమాదకారి అని.. అది సోకిన తరువాత వారం పది రోజుల వరకు సోకిన వ్యక్తికి కూడా సోకిందన్న విషయం తెలియదని, ఈ లోపు రోగితో పాటు పయనించే వైరస్ అతను కలసిని ప్రతీ వ్యక్తికి చేరుతుందని కూడా సూచించాడు. కరోనావైరస్ పై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ వెళ్తున్నలక్ష్మణరావుకు రోడ్డుపై తిరుగుతున్న గాదిపల్లి చిన్నారావు కనిపించాడు.
దీంతో అతన్ని ఇంట్లోకి వెళ్లాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నెల 20న ఒంటరిగా ఉన్న లక్ష్మణరావుపై చిన్నారావు, అతని తండ్రి సన్యాసి, సోదరుడు రామకృష్ణ దాడి చేశారు. బాధితుడిని తల్లిదండ్రులు సాలూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్ష్మణరావు ఈ నెల 26న పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. తరువాత అతడికి నయం కాకపోగా జిల్లా కేంద్రాసుపత్రికి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ ఎస్.సింహాద్రినాయుడు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more