80 new Covid-19 cases reported in AP ఏపీలో కరోనా విజృంభన.. 24 గంటల్లో 80 కేసులు

Ap records 80 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 177

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Andhra Pradesh reported 80 new Coronavirus positive cases, with this, the number of positive cases as of positive cases as of Monday morning reaches 1177 Mark and two deaths recorded in state taking the toll to 31. In all, 171 persons completed treatment and were discharged from hospitals.

ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనావైరస్.. 24 గంటల్లో 80 కేసులు

Posted: 04/27/2020 12:58 PM IST
Ap records 80 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 177

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల విజృంభన రోజురోజుకూ పెరుగుతోంది. మార్చిలో లాక్ డౌన్ విధించే సమయానికి కూడా పెద్దగా లేని కరోనా సాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం అంతకంతకూ పెరుగుతూపోతొంది. పోరుగునున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండగా, ఏపీలో మాత్రం కరోనా పంజావిసురుతోంది. వైద్య సిబ్బందికి సవాల్ విసురుతున్న మహమమారి.. తన ఉధృతిని కొనసాగిస్తోంది. గ్రీన్ జోన్ ప్రాంతాలు కూడా ప్రభావితం చేస్తూ వ్యాప్తిచెందుతున్న కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది.

ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ లింకు బయటపడిన తరువాత వారం పది రోజుల పాటు కరోనా వైరస్ రాష్ట్రంలో పెద్దగా వ్యాప్తించలేదు. లాక్ డౌన్ విధించిన తరువాతే ఇంత భారీ సంఖ్యలో వైరస్ వ్యాప్తి చెందడం అందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఏకంగా వెయ్యి మార్కును దాటడం రాష్ట్ర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1177కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరణాలు నమోదు చేసుకోనప్పటికీ.. పోరుగు రాష్ట్రాలతో పోల్చిచే 31 మరణాలు సంభించడం కలవరానికి గురిచేస్తోంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 171 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 33, కర్నూలులో 13, గుంటూరు జిల్లాలో 23 కేసులు, నెల్లూరులో 7 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు, శ్రీకాకుళంలో ఒక్క కేసు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1177కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 911 మంది చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్‌ జోన్లు, రెడ్‌ జోన్లలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు నమోదు కాగా, తాజాగా మరో మరణంతో మొత్తంగా 9 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 237 కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి.

నెల్లూరు-79 కేసులు రెండు మరణాలు, కృష్ణా-210 కేసులు, మరో మరణంతో మొత్తంగా ఎనమిది మరణాలు నమోదయ్యాయి, ప్రకాశం- 56, పశ్చిమగోదావరి-39, చిత్తూరు-73,  విశాఖపట్నం-22, కడప జిల్లాలో 58 కేసులు, అనంతపురం-53 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 39 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా నాలుగు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles