ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 429 కి చేరుకుంది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్తగా 24 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 17, కర్నూల్ 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు వచ్చాయి. ఇప్పటి వరకు కర్నూల్ జిల్లా లో అత్యధికంగా 82 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
కాగా... ఆ తరువాత గుంటూరులో 75 నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా సోకి 6 గురు మృతి చెందారు.( అనంతపురం 2,కృష్ణ2, గుంటూరు 1, కర్నూల్ 1)...కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ కాగా...ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 388 మందికి చికిత్స పొందుతున్నారు. ఇక ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో మూడు, నెల్లూరులో నాలుగు కేసుల చొప్పున మొత్తం 7 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు నమోదు కాగా, ఆ తరువాత గుంటూరు-93, నెల్లూరు-56, కృష్ణా-36, కడప-31, ప్రకాశం - 41, పశ్చిమగోదావరి-23, చిత్తూరు-23, విశాఖపట్నం-20, అనంతపురం-15, తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -17 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కృష్ణా, విశాఖపట్నాలలో నాలుగురు కోలుకోగా, చిత్తూరు, తూగో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒకొక్కరు చోప్పున కొలుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more