ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తనకు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణహాని పొంచి వుందన్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం లేదంటే, స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4 ప్లస్ 4 గన్ మెన్లతో ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశించాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
గతంలో తనకున్న 3 ప్లస్ 3 గన్మెన్లతో రక్షణ ఉండేదని, ఆ తర్వాత దాన్ని 2 ప్లస్ 2కు తగ్గించినట్టు కోర్టుకు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉండడంతో భద్రత పెంచాలని కోరుతూ 28 ఆగస్టు 2019న కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, జూపల్లి రామేశ్వరరావులను రేవంత్రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు.
మరోవైపు సీఎం కేసీఆర్ హైదరాబాదులో సలీమ్ అనే వృద్ధుడ్ని కలిసి అతడి కష్టాలు తీర్చారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన రేవంత్ రెడ్డి, అదంతా ఓ నాటకమని కొట్టిపారేశారు. కొడుకు కేటీఆర్ ఊర్లు తిరుగుంటే సీఎం కేసీఆర్ హైదరాబాదులో తిరుగుతూ సురభి నాటకాలను మించిపోయేలా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ నేతలు సంపన్నులయ్యారని, పేదలకు మాత్రం ఇళ్లు లభించలేదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్భాటాలకు పోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more