ఆ దంపతులు దివ్యాంగులు. అయినా భవిష్యత్తు మీద ఆశతో.. వృద్దాప్యంలో తమను చూసుకోవడానికి ఎవరు సాయం చేయాలన్నా.. లేక ఏ వైద్యం కోసం.. ఇక ప్రస్తుతం తమ జీవనం సాగాలన్న డబ్బు అవసరమని.. తమకు ఉపాధి లభించకపోవడంతో భిక్షాటన చేసుకునే జీవినం సాగిస్తున్నారు. అలాంటివారి ఇంటినే టార్గెట్ చేసిన వీరముష్టి దొంగ.. ఇంట్లోకి చోరబడి రూ.3 లక్షల సొత్తు చోరీ చేశాడు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి సహకరించిన మైనర్ బాలుడ్ని కూడా అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.
పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా పమిడికి చెందిన దంపతులు నాగరాజు, సరస్వతి దివ్యాంగులు. ఉపాధి కోసం తిరిగినా ఎక్కడా లభించకపోవడంతో హైదరాబాద్ లో భిక్షాటన చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఆ నగరంలో యాచనతో సంపాదించిన మొత్తాన్ని ప్రతి ఇరవై రోజులకోసారి సొంతూరు పమిడి వచ్చి తమ ఇంట్లోని బీరువాలో భద్రపరిచేవారు. ఈ విధంగా మూడు లక్షలు కూడబెట్టారు. ఓ ఇరవై ఐదు గ్రాముల బంగారం కూడా కొని దాచుకున్నారు. ఈ ఇంట్లో నాగరాజు తల్లి నారాయణమ్మ మాత్రమే ఉంటోంది.
ఈ విషయాన్ని నిందితుడు రామాంజనేయులు గమనించాడు. నారాయణమ్మ డిసెంబరు 10న ఓ వివాహానికి వెళ్లిందని తెలుసుకున్న రామాంజనేయులు ఓ బాలుడితో కలిసి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు, బంగారం అపహరించాడు. పెళ్లి నుంచి తిరిగి వచ్చిన నారాయణమ్మ చోరీ జరిగిందని గుర్తించి కొడుక్కి చెప్పడంతో డిసెంబరు 22న నాగరాజు పమిడి వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత 3 లక్షల నగదు, 25 గ్రాముల బంగారం అని ఫిర్యాదుచేసి తర్వాత లక్ష ఉందని, 2 లక్షల నగదే పోయిందని పోలీసులకు తెలిపాడు. కేసు విచారిస్తున్న పోలీసులకు ఓ బాలుడు బంగారం తాకట్టు పెట్టుకుంటావా? అని పలువురిని అడుగుతున్నట్లు సమాచారం అందింది.
దీంతో నిఘా పెట్టన పోలీసులు బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారించి.. నిందితుడు రామాంజనేయులును పెన్నానది ఒడ్డున ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద అదుులోకి తీసుకున్నారు. అప్పటికే 2 లక్షల నగదులో నిందితుడు రూ.40 వేలు ఖర్చు చేసేశాడు. తనకు సహకరించిన బాలుడికి రూ.10 వేలు ఇచ్చాడు. దీంతో మిగిలిన రూ.1.50 లక్షల నగదు, 25 గ్రాముల బంగారాన్ని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రామాంజనేయులుని జైలుకు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more