హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చావచితక బాదిన ఓ మహిళ.. తన భర్తతో కలసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పిర్యాదు చేసింది. రోడ్డు కూడలి వద్ద నిలబడ్డ బాలుడు ఏదో చెప్పబోతున్నా.. వినిపించుకోకుండా.. బాలుడన్న కనీస విచక్షణ కూడా లేకుండా వస్తూనే చాచికొట్టింది. తానేం చేయలేదని ఆ బాలుడు రోదిస్తూ చెప్పినా.. వినిపించుకోలేదు.. చివరాఖరుకు బాలుడు తనను వదిలిపెట్టాలని కాళ్లు మొక్కినా.. లేబర్ నా కొడుకులు, చిల్లరగాళ్లు అంటూ పెద్ద బాగోతమే చేసింది.
ఈ అమానుష ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది. స్థానికంగా వున్న రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆడుకుంటూన్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ మహిళ పరుగు పరుగున వచ్చి కూడలిలో నిల్చున్న బాలుడ్ని చాచిపెట్టి కొట్టింది. ఆ తరువాత ఆ బాలుడ్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లంది. ఇంతలో అమె భర్త కూడా వచ్చి బాలుడ్ని కోట్టాడు. అసలేం జరిగింది.. ఎందుకు వారు బాలుడ్ని కొడుతున్నారు అన్న విషయం తెలియకున్నా.. కనీసం చిన్నారిని కర్కశంగా కొట్టకుండా గుమ్మిగూడిన జనం ఆపిన పాపన పోలేదు.
తానేం చెశానో కూడా తెలియకపోయినా.. దెబ్బలు తిన్న బాధిత బాలుడు.. తనను వదిలిపెట్టాలని కోరుతూ మహిళ కాళ్లు మొక్కినా.. అమె కనీస కనికరం కూడా చూపలేదు. పైగా లేబర్ నా కొడుకులు, చిల్లరగాళ్లు అంటూ పెద్ద సీన్ చేసింది. ఇక ఆతర్వాత.. రోడ్డుపై బాహాటంగా అందరూ చూస్తుండగా తాను బాలుడ్ని కొట్టానని.. ఈ దృశ్యాలు నెట్ లో ప్రత్యక్ష అవుతాయని భావించిన దంపతులు ముందస్తు జాగ్రత్తగా వెళ్లి బాలుడిపై పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అదే పోలిస్ స్టేషన్ కు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు దంపతులపై పిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ దృశ్యాలను చూడటంతో వారికి అసలు విషయమేంటో అర్ధమైంది. విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు పెట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు. దంపతుల చేతిలో దెబ్బలు తిన్న బాలుడ్ని అతడి తల్లిదండ్రులు అసుపత్రిలో చికిత్స చేయించారు. మహిళ తనపై విరుచుకుపడి దాడి చేసిన విధానానికి భయకంపితుడైన బాలుడ జర్వంతో బాధపడుతున్నాడని అతడి కుటుంబసభ్యలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more