భారత రాజ్యాంగ ముసాయిదా రచనపై గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదాను బ్రాహ్మణుడైన బీఎన్ రౌ రాశారని, ఈ విషయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కరే స్వయంగా చెప్పి, బీఎన్ రౌకు క్రెడిట్ ఇచ్చారని స్పీకర్ రాజేంద్ర త్రివేది వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులు ఎప్పుడూ ఇతర ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తారని చరిత్ర చెబుతుందని రాజేంద్ర పేర్కొన్నారు. అడాలజ్ పట్టణంలో జరిగిన ‘మెగా బ్రాహ్మణ బిజినెస్ సదస్సు’లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీతో సహా 9 మంది భారతీయ నోబెల్ విజేతలలో 8 మంది బ్రాహ్మణులు అని ఆయన పేర్కొన్నారు. ‘‘60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి,మన ముసాయిదా రాజ్యాంగం తయారు చేశారని మీకు తెలుసా? ఆ ముసాయిదాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఎవరు సమర్పించారో మీకు తెలుసా? రాజ్యాంగం విషయానికి వస్తే మనమందరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును గౌరవంగా తీసుకుంటాం...అయితే, అంబేద్కర్ సొంత మాటల్లోనే ముసాయిదాను బీఎన్ రౌ (బెనెగల్ నర్సింగ్ రౌ) అనే ఒక బ్రాహ్మణుడు తయారు చేశాడు’’ అని రాజేంద్ర త్రివేది చెప్పారు.
‘‘బ్రాహ్మణులు ఎప్పుడూ వెనుక నిలబడి ఇతరులను ప్రోత్సహిస్తారని చరిత్ర చెబుతుంది. బీఎన్ రౌ అంబేద్కర్ను తనకంటే ముందు ఉంచారు.1949 నవంబర్ 25 న జరిగిన రాజ్యాంగ సభలో తన ప్రసంగంలో అంబేద్కర్ ఈ విషయాన్ని అంగీకరించినందున మేం గర్విస్తున్నాం ”అని త్రివేది వివరించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మందిని రక్షించిన ఢిల్లీ అగ్నిమాపకశాఖ జవాన్ రాజేష్ శుక్లా కూడా బ్రాహ్మణుడేనని, ఈయన కూడా తమ బ్రాహ్మణ కులానికి ఆదర్శంగా నిలిచారని తివారీ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more