అయ్యప్పస్వామి కొలువైన శబరిమల కొండకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాధి మంది భక్తులు మాలాధారణ చేసుకుని మండల పూజ నిర్వహిస్తున్నారు. మండలం పూర్తైన తరువాత ఇరుముడి ధరించి ఎంతో భక్తిప్రవత్తులతో శబరిమల కొండకు చేరకుంటారు. ఇక మరికొందరు భక్తులు సివిల్ స్వాములు కూడా మాలాధారణ లేకుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ సారి శబరిమలకు చేరకునే భక్తులకు ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా భక్తులు సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేధించింది.
ఆలయంలోని గర్భగుడి సహా పరిసర ప్రాంతాల్లో మోబైల్ ఫోన్ వినియోగించకూడదని ఆంక్షలు విధించింది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్తానం బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత భద్రతతో కూడిన అయ్యప్ప స్వామి గర్భాలయం, స్వామి మూలవిరాట్ మూర్తికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని కారణంగా ఆలయ పవిత్రత, దెబ్బతింటోందని యాజమాన్యం భావించింది. వీటికి కారణమైన సెల్ ఫోన్ ను ఆయన పరిసరాల్లో నిషేధించడం ఒక్కటే దీన్ని అరికట్టేందుకు మార్గంగా భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
శబరిమలలో ఇరుముడి ధరించిన అయ్యప్పస్వాములకు మాత్రమే 18 బంగారు మెట్లు ఎక్కే అవకాశం వుండటంతో.. వారు ఇలా ఆ పదునెట్టాంబడి ఎక్కుతున్న క్రమంలో వారితో వచ్చిన సివిల్ స్వాములు తమ మోబైల్ లో వారి ఫోటోలను క్లిక్ చేస్తున్నారని కూడా దేవస్తానం బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు గర్భాలయం పరిసర ప్రాంతాలను అత్యంత పవిత్రమైన ప్రాంతాలుగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాల్లో సెల్ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. కూలంకశంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు సభ్యులు ప్రకటించారు.
అంతే కాదు.. బోర్డు ఆదేశాలను అతిక్రమించి ఆలయ పరిసర ప్రదేశాల్లో సెల్ఫోన్లను వాడిన క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా దేవస్తానం బోర్డు హెచ్చింరింది. అదే సమయంలో ఈ ఏడాది అయ్యప్ప భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని దేవస్వోమ్ బోర్డు ప్రకటించింది. నవంబరు 16 నుంచి డిసెంబరు 3 వరకు దాదాపు 7 లక్షలకు పైగా భక్తులు అయ్యప్ప దర్శనానికి వచ్చారని అంచనా. ఈ ఏడాది నవంబరు 16 నుంచి వార్షిక మండల పూజ ప్రారంభమైంది. అప్పటి నుంచి భారీ సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల కొండకు వస్తున్నట్లు శబరిమల అయ్యప్ప ఆలయం బోర్డు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more