కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నమోదు మోపిన అభియోగాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చిదంబరంకు బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 106 రోజుల తరువాత ఆయనకు కండీషనల్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. కోర్టు రెండు లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది.
సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్నలతో కూడిన తిసభ్య ధర్మాసనం చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే సాక్ష్యాల్ని ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని న్యాయస్థానం అదేశించింది. ఈ విషయమై మీడియా సంస్థలతో ముఖాముఖిలు గానీ, బహిరంగ ప్రకటనలు కానీ చేయవద్దని కూడా అదేశించింది. ఇక న్యాయస్థానం అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని కూడా న్యాయస్థానం షరతు విధించింది. చిదంబరం బెయిల్ పై విడుదలవుతున్న సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉండటం గమనార్హం.
ఆగస్టు 21న సీబీఐ అధికారులు అనేక నాటకీయ పరిణామాల మధ్య చిదరంబరాన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం అక్టోబర్ 16న కోర్టు ఆదేశాల మేరకు ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. దీంతో 106 రోజులుగా ఆయన జుడిషియల్ రిమాండ్లోనే ఉన్నారు. అయితే అక్రమ లావాదేవీలపై సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు అక్టోబర్ 21న బెయిల్ లభించిగా. ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆయన జైలులోనే వుండాల్సి వచ్చింది. తాజాగా ఈడీ కేసులోనూ ఊరట లభించడంతో ఆయన జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది. దీంతో చిదంబరం ఇవాళ తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more