హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని గత కొద్ది కాలంగా ప్రచారం జోరందుకుంది. దీనికి బలాన్ని ఇచ్చేలా అటు బిజేపి నేతలు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఉత్తరాదిన వుండటం తో పూర్తిగా వారి అదిపత్యమే కనబడుతోందని, దక్షిణాదివారికి అంతగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత కనిపించడం లేదని కూడా విమర్శలు వున్నాయి. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కేంద్రమంత్రి ఉత్తరాది, దక్షణాదికి మధ్య తేడాలను కూడా వర్ణాలుగా, వర్గాలుగా విశ్లేషించారు. ఈ క్రమంలో దేశానికి రెండో రాజధాని అంశం తెరపైకి వచ్చింది.
దీనికి తోడు దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్ ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. దక్షిణాదికి కూడా రాజకీయాంగా ప్రాముఖ్యత లభిస్తుందని వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రచారంతో హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే వార్తలొచ్చాయి.
కానీ ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే మరో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయమై వివరణ ఇచ్చారు. హైదరాబాద్ను రెండో రాజధాని చేసే యోచన కేంద్రానికి లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more